- వివాదాల పైలెట్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
పైలెట్ రోహిత్ రెడ్డి తెలంగాణా రాజకీయాల్లో ఎంత వేగంగా తెరపైకి వచ్చారో….అంతే వేగంగా ఆయన చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. రాజకీయంగా ఒకే సారి ఎమ్మెల్యే అయినా….ఆయన వేస్తున్న అడుగులు వివాదానికి కేరాఫ్ గా మార్చుతున్నాయి. తాండూరు నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించినా…మళ్లీ తన సొంత గూడైన బీఆర్ఎస్ కు చేరుకున్నారు. ఎమ్మెల్యే కాక ముందు ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంగా అడుగులు వేసిన యువనేత అతి తక్కువ సమయంలోనే తన టార్గెట్ కు రీచ్ అయ్యారు.

కానీ అక్కడే అసలు వివాదాలు మొదలయ్యాయి. ఒకే సారి ఎమ్మెల్యేగా అనుభవం ఉన్నా…. సుదీర్ఘ రాజకీయ నేతల మాదిరిగా రాజకీయ ఎత్తులు వేస్తూ…. తన మార్క్ రాజకీయాల్లో వేసుకున్నారు. కానీ వివాదాలతో తన రాజకీయ భవిష్యత్తు చుట్టూ వివాదాలు రేగేలా చేసుకుంటున్నారు.
బీజేపీ ఆపరేషన్ ఆ ఫాం హౌస్ లోనే….
ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బీఆర్ ఎస్ అధినేతకు అత్యంత నమ్మకమైన ఎమ్మెల్యేగా మారిపోయారు. అప్పట్లో రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాలతో పైలెట్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్ జాతీయ రాజకీయాల్లో కూడా తీవ్ర చర్చకు దారి తీసింది. బీఆర్ ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను జాతీయ బీజేపీ నేతలు ప్రభావితం చేస్తూ బీజేపీలో చేరేందుకు ఆపరేషన్ నిర్వహించారన్నది అప్పట్లో ఆ ఫాం హౌస్ చుట్టూ జరిగిన వివాదం. ఈ వివాదంలో బీజేపీ కీలక నేత సంతోష్ తో పాటు స్వామీజీల పేర్లు తెరపైకి వచ్చాయి.

బీఆర్ ఎస్ సర్కార్ ఎవరూ ఊహించని విధంగా సంతోష్ ను పేరును ఈ కేసులో నమోదు చేసి ఆయనపై కూడా కేసు నమోదు చేసింది. ఈ ఘటన అనంతరం దాదాపు 3 నెలల పాటు పైలెట్ రోహిత్ రెడ్డి కేసిఆర్ నివాసం అయిన అప్పటి ప్రగతి భవన్ లోనే ఉండాల్సి వచ్చింది. ఈ వివాదంలో పైలెట్ రెహిత్ రెడ్డితో పాటు కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే మర్ష వర్ధన్ రెడ్డి, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రేగా కాంతారావ్లు వీఎంఆర్ ఫాం హౌస్ కేంద్రంగానే ఈ ఆపరేషన్ ను సమర్దవంతంగా ముగించారు.
తాజాగా మరోసారి పైలెట్ ఫాంహస్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయంశంగా మారింది. పైలెట్ రోహిత్ రెడ్డి, తన సొదరుడు రితీష్ రెడ్డితో పాటు ఏపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, బెంగుళూరు చెందిన న్యాయవాది, ఢిల్లీకి చెందిన వ్యాపారులు ఈ ఫాం హౌస్ లో నిషేధిత డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డారు.
ఎంపీ, మాజీ ఎమ్మెల్యేల డ్రగ్స్ పార్టీ…..

శనివారం రాత్రి ఈఘటన చేసుకోవడంతో ఆదివారం ఉదయం నుంచి ఫాం హౌస్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పోలీసులు దాడులు చేసేందుకు వస్తున్నది గమనించి రితేష్ రెడ్డి లైసన్స్ రివాల్వర్ తో నమీత్ కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఈ అంశాన్ని మరింత సీరియస్ గా పరిగణిస్తున్నారు. 11 మంది ఫాం హౌస్ లో పోలీసులకు పట్టుబడగా..అందులో ఐదుగురికి డ్రగ్ తీసుకున్నట్లు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. తదుపరి పరీక్షల కోసం రక్త నమూనాలను ల్యాబోరెటరీకి పంపించారు.దీని ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు.పైలెట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా బెంగుళూరు డ్రగ్స్ పార్టీలో రోహిత్ ప్రముఖంగా వినిపించింది. ఈకేసు అప్పట్లో తెలంగాణా రాజకీయాల్లో దూమారం రేపింది.
ఎంపీకి పుట్టా మహేష్ కూడా పాజిటివ్…

మొయినాబాద్ ఎస్సై నజీముద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొత్తం 11మంది పై కేసు నమోదు చేశారు. డ్రగ్స్ వినియోగంపై పూర్తి సమాచారం సేకరించేందుకు రహస్యంగా పోలీసులు వీరిని విచారిస్తున్నారు. రాత్రి నిర్వహించిన ర్యాపిడ్ టెస్ట్ లో ఎంపీ పుట్టా మహేష్ కు నెగిటివ్ రాగా….. బ్లడ్ షాంపిల్స్ లో పాజిటివ్ గా తేలింది. బ్లడ్ శాంపిల్స్ రిపోర్టు ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ సెక్షన్లతో కేసులు….
BNS U/s 8(c), 22(A), 27, 29 of NDPS Act, Sec 25(1B)(a), 30 of Arms act, 34(a) TSEA act & Sec 109, 131 r/w 3(5) BNS
పోలీసులపై కాల్పులకు యత్నం చేశారా….?








Leave a Reply