- పైలెట్ రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాజకీయం అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి….ఆ నేతలు అనుసరించే విధానాలను ఎంతో మంది పరిశీలిస్తుంటారు. వారికి ఉండే ఫ్యాన్ పాలోయింగ్ నేతలు చేస్తున్న విధానాలనే అమలు చేసే యత్నం చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ నేతలు కూడా ప్రజా జీవితంలో ఉన్న సమయంలో ఎంతో క్రమశిక్షణతో మెలగాల్సి ఉంటుంది. కానీ పైలెట్ రాజకీయ జీవితం అంతా వివాదాల మయంగా మారింది. గతంలో ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. ఎమ్మెల్యేగా ఉండడం, రాజకీయంగా పార్టీ పూర్తి స్థాయిలో అండగా నిలువడంతో ఆ వివాదాల నుంచి పైలెట్ రోహిత్ రెడ్డి ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటపడ్డారు.

కానీ తాజాగా తన ఫాం హౌస్ లో డ్రగ్స్ తీసుకుని డ్రగ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడం తెలంగాణా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. పైలెట్ తో పాటు ఏపీ కి చెందిన ఓ ఎంపీ కూడా డ్రగ్ పాజిటివ్ గా తేలారు. రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు నిషేధిత డ్రగ్ సహా వీరిని పట్టుకోవడం సంచలనం రేపుతోంది. ప్రస్తుతం పైలెట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే కాదు…పైలెట్ ఉన్న పార్టీ కూడా అధికారంలో లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉండడంతో అధికార పార్టీ ఇదే అదనుగా ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసి మాజీ ఎమ్మెల్యే సహా పార్టీని ఇరుకున పెట్టే విదంగా ప్రణాళికలు అమలు చేసే అవకాశం ఉంటుంది. పైలెట్ డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారించినట్లు పోలీసులు వెల్లడించడంతో గులాబీ పార్టీ కూడా ఆత్మరక్షణలో పడే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో రోహిత్ రెడ్డికి పార్టీ అండగా ఉంటుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అధికార పార్టీగా కాంగ్రెస్ ఈ అంశాన్ని అసరాగా చేసుకుని బీఆర్ ఎస్ ను మరింత ఇరుకున పెట్టే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ ఎస్ పార్టీకి కూడా ఇది ఇబ్బంది కరమైన పరిణామంగానే చెప్పుకోవచ్చు. బీఆర్ ఎస్ పైలెట్ కు రాజకీయంగా అండగా ఉంటుందా…లేదంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందా అన్న దానిపై చర్చలు మొదలయ్యాయి.

అయితే ఈ కేసులో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన సిట్టింగ్ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కూడా డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ కావడం ఏపీ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. అక్కడ తెలుగుదేశం పార్టీ అధికార పార్టీగా ఉంది. దీంతో ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీని కూడా ఆత్మరక్షణలో వేసే చాన్స్ కనిపిస్తోంది. రాజకీయంగా భిన్న ధృవాలుగా ఉండే బీఆర్ఎస్, టీడీపీ నేతలు ఈ డ్రగ్స్ పార్టీలో ఒకేసారి పట్టుబడడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు హాట్ హాట్ గా మారింది.
బీజేపీ మాజీ ఎమ్మెల్యే నమీత్ శర్మ కూడా ఈ వివాదంలో ఉన్నారని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వెల్లడించారు. … ఈవ్యవహారం మరింత రంజుగా మారింది. తెలుగుదేశం, బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలకు చెందిన నేతలు ఒకే కేసులో పట్టుబడడం మరోసారి ఈ వ్యవహారం రాజకీయంగా దూమారం రేపే అవకావం కనిపిస్తోంది. పోలీసులు నిర్వహించిన పకడ్బంధీ ఆపరేషన్ బీఆర్ ఎస్ కీలక నేతలను ఇబ్బంది పెట్టే విధంగా కూడా కనిపిస్తోంది. పైలెట్ రాజకీయ ప్రత్యర్థులు మరోసారి గతంలో ఉన్న రోహిత్ రెడ్డిపై నమోదైన కేసులను ప్రస్తావిస్తూ రాజకీయంగా దెబ్బ కొట్టేలా పావులు కదుపుతున్నారు.








Leave a Reply