
(తిరుమల,న్యూస్ఇన్)
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమలలోని వసతిగృహాల్లో దిండు, దుప్పటి, చాప, రగ్గులను తితిదే అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుతం నందకంలో మాత్రమే ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు.
త్వరలో వకుళమాత, పాంచజన్యం, కౌస్తుభం వంటి అతిథిగృహాల్లో కూడా అందించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. వేసవి నేపథ్యంలో గదుల్లో అదనంగా వచ్చే పెద్దలు, చిన్నారుల కోసం వీటిని భక్తులు ఇటీవలి కాలంలో ఎక్కువగా అడుగుతుండడంతో టీటీడీ అదనంగా ఈ దిండ్లు, దుప్పట్లు అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయం తీసుకుంది. ఒక దుప్పటి రూ.10, రెండు దిండ్లకు రూ.10, చాప రూ.10, రగ్గు రూ.20కు అందించాలని టీటీడీ ధరలను నిర్ణయించింది




Leave a Reply