రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ డ్రగ్ పార్టీ లో పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలను ప్రస్తావించారు. రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు ఫాం హౌస్ లోకి వెళ్లగానే ఫైర్ చేసినట్లు శబ్దం వినిపించిందని పేర్కొన్నారు. ఈ శబ్దంతో అప్రమత్తం అయి మేం పోలీసులం కాల్చవద్దని గట్టిగా అరుస్తూనే ఉన్నాం….అయినా మరో సారి కాల్పుల శబ్దంతో భయాందోళనలకు గురయ్యాం.మరో వైపు మీరు కాల్పులు జరుపండి మేము చూసుకుంటాం అని పార్టీలో ఉన్న వాళ్ల నుంచి తమకు చెప్పినట్లు విన్నట్లు రిమాండ్ రోపోర్ట్ లో వెల్లడించారు. మేం గట్టిగా అరుస్తూ వాళ్ల వదగ్గరకు చేరుకోవడంతో ఫైరింగ్ ఆగిపోయింది. వెంటనే ఫాం హౌస్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరకు చేరుకుని ఫాం హౌస్ సెర్చ్ వారంట్ ను మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇచ్చామని తెలిపారు.

బాత్ రూం దగ్గర నిలుచున్న నమీత్ శర్మ చేతిలో ఉన్న తుపాకి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలో ఫాంహౌస్ లో ఒక మహిళతో పాటు 10 మంది ఉండడంతో వారిని మొత్తం అదుపులోకి తీసుకున్నట్లు రిపోర్ట్ లో తెలియచేశారు. స్వాధీనం చేసుకున్న రివాల్వర్ జర్మన్ మేడ్ 32 అని పోలీసులు పేర్కొన్నారు. అప్పుడే అందరినీ విడివిడిగా విచారిస్తే డ్రగ్స్ తీసుకున్నట్లు ఎవరూ విచారణ లో చెప్పలేదని, అయితే వరుసగా ప్రశ్నలు సంధించడంతో సిలివేరి శరత్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈడ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయని అడిగితే… సమాచారం లేదని, అయితే పైలెట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ ను విచారిస్తే. కొకైన్ విషయం వెలుగు చూసిందన్నారు. సిమ్లా బిజినెస్ టూర్ కు వెళ్లినప్పుడు అక్కడి నుంచి కొకైన్ తెచ్చినట్లు కౌషిక్ అంగీకరించారని, ఒక్క గ్రాము కొకైనా 15 వేల రుపాయలకు అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసులు రిపోర్ట్ లో పేర్కొన్నారు.

అప్పుడే అక్కడున్న 11 మందికి డ్రగ్ లైవ్ కిట్ ద్వారా పరీక్షలు నిర్వహించామని, అర్జున్ రెడ్డి, కౌషిక్ రవి, నమీత్ శర్మ, రోహిత్ రెడ్డి లకు పాజిటివ్ గా నిర్ధారణ అయిందన్నారు. కాల్పులు జరిపిన నమీత్ శర్మని అరెస్టు చేశామన్నారు. తాము స్వాధీనం చేసుకున్న రివాల్వర్ పైలెట్ రోహిత్ రెడ్డి సోదరుడి రితీష్ రెడ్డిగా గుర్తించామని పోలీసులు పేర్కొ్నారు. లైసన్స్ డ్ రివాల్వర్ రితీష్ రెడ్డి దగ్గర ఉండాల్సి ఉండగా…నమీత్ శర్మ దగ్గరకు ఎలా వచ్చిందని తెలసుకునే ప్రయత్నంలో నమీత్ శర్హ ఉద్దేశ పూర్తకంగానే భయభ్రాంతులకు గురిచేసేందుకు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
తప్పించుకునే యత్నం చేశారు……
కాల్పులు జరిపి పోలీసులను గాయపరిచి ఫాం హౌస్ నుంచి పారిపోయేందుకు వారు ప్రయత్నించారని నివేదికలో పేర్కొన్నారు. ఆ తరువాత తమ విచారణలో మద్యం తో పాటు డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించారన్నారు. తాము ర్యాపిడ్ టెస్ట్ చేసినా…రెండో ఒపినియన్ కోసం ఎర్రగడ్డ ఆసుప్రతిలో వారికి బ్లడ్ శాంపిల్స్ తో పరీక్షలు నిర్వహించడంతో అక్కడ పుట్ఆ మహేష్ కుమార్ కు పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి , అర్జున్ రెడ్డిలు కొకైన్ తీసుకున్నట్లుగా రిపోర్ట్ వచ్చింది మొత్తం ఈ కేసులో ఆరుగురికి డ్రగ్ పాజిటివ్గా వచ్చిందన్నారు. తాను వీకెండ్ పార్టీ ఏర్పాటు చేస్తునట్లు పైలెట్ రోహిత్ రెడ్డి ముందుగా సమాచారం ఇవ్వడంతో పైలెట్ ఆహ్వానంతో అంతా ఫాం హౌస్ కు చేరుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.
డ్రగ్ పార్టీలో ముగ్గురికి రిమాండ్…. అందరికీ బేయిల్







Leave a Reply