NewsInn

News in a Click

అప్ప‌ట్లో నీరో- ఇప్పుడు జీరో చ‌క్ర‌వ‌ర్తి

అప్ప‌ట్లో నీరో- ఇప్పుడు జీరో చ‌క్ర‌వ‌ర్తి

అసెంబ్లీలో సీఎం పై కేటిఆర్ ఘాటు వ్యాఖ్య‌లు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రాష్ట్ర ప‌రిస్థితి అస్త‌వ్య‌స్థంగా మారింద‌ని కేటిఆర్ ఆరోపించారు. ఆర్ధిక క్ర‌మ‌శిక్ష‌ణ పై అవగాహ‌న‌లేక‌పోవడంతోనే ఈప‌రిస్థితి త‌లెత్తుతుంద‌న్నారు. అధికార ప‌క్షానికి ఈ ప‌రిస్థితిపై అవ‌గాహ‌న క‌ల్పించే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈరోజు అసెంబ్లీలో కేటిఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర‌భుత్వ వైఫల్యాల‌ను ఎండ‌గ‌ట్టారు. ఆరు హామీల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తామ‌ని చెప్పిన ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు దాటిపోయినా ఆ దిశ‌గా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు.అప్ప‌టి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై తో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో చెప్పించి కాంగ్రెస్ మోసం చేసింద‌ని ఆరోపించారు. తెలంగాణ , దివాలా తీసిందని దుష్ప్రచారం చేస్తే నష్టపోయేది రాష్ట్రమే. రాష్ట్ర ఆర్థిక చక్రం పూర్తిగా అపసవ్య దిశలో ఎందుకు తిరుగుతున్నదో కాంగ్రెస్ సమాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉద‌న్నారు.

తలసరి ఆదాయంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టిన ఘ‌న‌త‌ కేసీఆర్ కే ద‌క్కుతుంద‌న్నారు. కానీ ఈరోజు రాష్ట్రం తలసరి ఆదాయంలో 6వ స్థానానికి పడిపోయింద‌న్నారు. సారాయి దుకాణాలు తెరవాలని డిమాండ్లు చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మ‌ళ్లీ చూడాల్సి వ‌స్తోంద‌న్నారు. ఒకప్పుడు నీరో చక్రవర్తి గురించి చూశాము….ఇప్పుడు జీరో చక్రవర్తిని చూస్తున్నాము. ప్రజల ఆస్తులను జీరో వాల్యూ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కే ఈ ఘ‌న‌త ద‌క్కుతుంద‌న్నారు.

కేటీఆర్ స్పీచ్ పాయింట్స్……

దావోస్‌తో పాటు మొన్న జరిగిన కాన్ఫరెన్స్ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల పై శ్వేత‌ప‌త్రం విడుదల చేయాలి

ప్రభుత్వం అక్కడ గ్రాఫిక్స్ మాయాజాలంతో ఫ్యూచర్ సిటీ పేరు చెప్పి అబద్ధాలు చెబుతోంది.

ఫార్మా సిటీ భూసేకరణ కేవలం ఫార్మా అవసరాల కోసమే వాడుకోవాలనే నిబంధనలు ఉన్నాయి.

ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇండ్లు ఇస్తామని చెప్పి అందరినీ ప్ర‌భుత్వం మోసం చేస్తున్నది. ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఇంకొక మోసానికి పాల్పడుతున్నది.

కేటిఆర్ కు సీత‌క్క స‌వాల్…..

అన్ని అబద్ధాలు చెబితే పారిశ్రామికవేత్తలకు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన నమ్మకం కలుగుతుంది?

రాష్ట్రంలో పారిశ్రామికవేత్తల తుపాకీ పెట్టి బెదిరిస్తే పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వస్తారా

తెలంగాణాలో కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామంటే చేరగ‌వు….. అణువణువునా కేసీఆర్ ఆనవాళ్లే ఉన్నాయి.

కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపేసే శక్తి ఎవరికీ లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూర్చున్న సచివాలయం, కమాండ్ కంట్రోల్, ఫ్యూచర్ సిటీ.. చివరికి తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్లు కావా

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాబడి2024-25లో అంచనాల్లో సగం కూడా రాలేదు..!

2023-24లో 14,295 కోట్లు వస్తే..2024-25 లో 8473 కోట్లకు పతనమైంది..!

పదేండ్ల కాలంలో 25 శాతం సగటు గ్రోత్ రేటుతో .. ఆకాశమే హద్దుగా దూసుకెళ్లింది రిజస్ట్రేషన్ ఆదాయం!

ఇప్పడంతా..నేల చూపులు! గత ఏడాది షాక్ అంచనాలు తగ్గించి
ఈ సారి 19వేల కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *