
(హైదరాబాద్,న్యూస్ఇన్)
మూసీ సుందరీకరణ పేరుతో ప్రభుత్వం ఆ ప్రాజెక్టులో దోపిడికి పాల్పడుతుందని ఆరోపిస్తూ బీఆర్ ఎస్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రటకించింది. ప్రభుత్వం దగ్గర డీపిఆర్ లేదు..ప్రాజెక్టు సమాచారం లేదు. ఎన్ని ఇళ్లు కూలగొడుతారో చెప్పడం లేదు… ఇలా అన్నీ అనుమానాలే ఉన్న ఇలాంటి ప్రాజెక్టు చేపట్టడానికి తాము వ్యతిరేకిస్తున్నామని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అన్నారు. ఈ ప్రాజెక్టు పై బాధితుల మధ్యలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయమని తాము కోరామని, అయితే స్టార్ హోటల్ లో పెట్టినందుకు తాము హాజరు కాలేదన్నారు. మూసీని మురికి కూపంగా మార్చింది కాంగ్రెస్ పార్టీయే అని కేటిఆర్ ఆరోపించారు. ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వం దగ్గర ప్రణాళికా లేదు…నిధులు లేవు..లోన్ రాలేదని కేటిఆర్ వ్యాఖ్యానించారు.







Leave a Reply