NewsInn

News in a Click

న‌గ‌రంలో మెస్సీ….. 7 గంట‌ల‌కు మ్యాచ్

న‌గ‌రంలో మెస్సీ….. 7 గంట‌ల‌కు మ్యాచ్

రంగంలోకి దిగ‌నున్న సీఎం రేవంత్
మ్యాచ్ వీక్షించ‌నున్న రాహూల్
ప‌టిష్ట భ్ర‌ద‌తా చ‌ర్య‌లు
మెస్సీని కాన్వాయ్ కి గ్రీన్ ఛాన‌ల్
(హైద‌రాబాద్, న్యూస్ఇన్‌)

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు వస్తున్నారు. డిసెంబర్‌ 13, 14, 15 తేదీల్లో ఆయన కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో పర్యటించనున్నారు.  ఈ క్రమంలో అభిమానులు మెస్సీతో ప్రత్యేకంగా ఫోటోలు తీసుకోవచ్చు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే ‘మెస్సితో మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమంలో ఆయనతో ఫొటోలు దిగొచ్చు. ఫోటో దిగాలనుకునే అభిమానులు రూ.10 లక్షలు చెల్లించి ఫోటోలు దిగవచ్చని, వందమంది వరకూ ఫోటోలు దిగే అవకాశం ఉంటుందని హైదరాబాద్‌లోని ‘ద గోట్‌ టూర్‌’ నిర్వాహక కమిటీ వెల్ల‌డించింది.

మెస్సీ కార్య‌క్ర‌మ‌ టికెట్లు డిస్ట్రిక్ట్‌ యాప్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మెస్సీ..శనివారం రాత్రి 7 గంటలకు ఉప్పల్‌ స్టేడియానికి వస్తారు. మెస్సితో పాటు రోడ్రిగో డి పాల్‌, లూయిస్‌ సువారెజ్‌ కూడా స్టేడియంకు వస్తారు. ఇందులో భాగంగా సింగరేణి ఆర్‌ఆర్‌-9తో, అపర్ణ మెస్సి ఆల్‌ స్టార్స్‌ జట్టు 20 నిమిషాల పాటు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఆడుతుంది. ఆ తర్వాత ఫుట్‌బాల్ క్లినిక్ ఉంటుంది. దీనిలో భాగంగా మెస్సీ.. చిన్నారులకు ఫుట్‌బాల్‌ ఎలా ఆడాలి.. ఎలా ట్రైనింగ్ తీసుకోవాలి.. ఏమేం నేర్చుకోవాలి అనే చిట్కాలు చెబుతారు.

అలానే మెస్సీ సమక్షంలో పెనాల్టీ షూటౌట్‌ కూడా నిర్వహిస్తారు. గెలిచిన వారికి మెస్సి బహుమతులు ఇస్తారు. అనంతరం నిర్వహించే పరేడ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి.. మెస్సీని సన్మానిస్తారు. ఈ క్రమంలో సుమారు గంట పాటు మెస్సీ ఉప్పల్‌ స్టేడియంలో ఉంటారు. శనివారం రాత్రి మెస్సీ హైదరాబాద్‌లోనే బస చేసి.. ఆదివారం ఉదయం ముంబైకి వెళుతారు.మెస్సీ తో మ్యాచ్ లో సీఎం టీం రంగంలోకి దిగ‌నుంది. ఈ టీం పేరు ఆర్ ఆర్ 9 ( రేవంత్ రెడ్డి 9) గా పెట్టారు. గ‌త కొన్ని రోజులుగా సీఏం రేవంత్ వ‌రుస‌గా ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు.

ఏఐసీసీ అగ్ర‌నేత రాహూల్ గాంధీ మెస్సీతో మ్యాచ్ చూసేందుకు హైద‌రాబాద్ రానున్నారు. ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ చేరుకునే ఆయ‌న మెస్సీ బ‌స చేసే హోటల్ కు వెళుతారు. అనంత‌రం ఉప్ప‌ల్ స్టేడియంకు చేరుకుంటారు. ఈ మ్యాచ్ ముగిసిన వెంట‌నే రాహూల్ ఢిల్లీ వెళ్లిపోనున్నారు. ఈ మ్యాచ్ కోసం పోలీసులు భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేశారు. క‌నీసం మెస్సీని చూసేందుకు రోడ్ల‌పైకి కూడా జ‌నం రావ‌ద్ద‌నిపోలీసులు సూచించారు. జ‌డ్ క్యాట‌గిరి భ‌ద్ర‌త‌, గ్రీన్ ఛాన‌ల్ ద్వారా మెస్సీ ఫ‌ల‌క్ న‌మా ప్యాలెస్ నుంచి ఉప్ప‌ల్ స్టేడియం కు చేరుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *