-సీఎం చంద్రబాబు నాయుడు
(అమరావతి,న్యూస్ఇన్)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు జనాభా పెంచడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పనిలో పడింది. ప్రస్తుతం ఉన్న జనాభా లెక్కలు….. గత కొన్నేళ్లుగా జనాభా పెరుగుదలలో వస్తున్న మార్పులను పరిశీలిస్తున్న ప్రభుత్వం కొత్తగా పాపులేషన్ పాలసీ తెచ్చేందుకు రెడీ అవుతోంది. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం ఇందుకు సూత్ర ప్రాయ ఆమోదం తెలిపినా….ఇంకా పాపులేషన్ పాలసీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది పండగ ప్రభుత్వం నిర్వహించిన ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఈ పాలసీలో ఒక కీలక ప్రతిపాదన ఉండబోతుందని ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య పెరుగుతోందని, దీనితో ఉపయోగం పెద్దగా ఉండదని చెబుతూ…. జనాభా పెరుగుదల కోసం తమ ప్రభుత్వం పాలసీ అమలు చేసేందుకు నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం 1.2 శాతంగా ఉన్న జనాభా పెరుగుదలను 2 , 3 శాతానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై 3వ బిడ్డ పుడితే ఆ కుటుంబానికి ఆర్ధిక సహాయం 20 నుంచి 25 వేల రుపాయాలు ప్రభుత్వం నుంచి అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేడమే తన లక్ష్యమన్నారు.ఏపీ లో కొత్త పథకం గురించి తెలుసా….







Leave a Reply