
(హైదరాబాద్,న్యూస్ఇన్)
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రమూర్తి ఆలయ అభివృద్ధి పనులను మూడు దశల్లో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు పూర్తయిన భూసేకరణకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులను, చేపట్టాల్సిన పనుల డిజైన్లను సీఎం పరిశీలించారు. ఆలయ సహజత్వానికి భంగం కలుగకుండా పూర్తిగా ఆగమశాస్త్రానుసారం అభివృద్ధి పనులను చేప్టాలని సీఎం ఆదేశించారు. ఈ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తరాదని సీఎం సూచించారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పూర్తయ్యేలా తొలి విడత పనులను పూర్తి చేసే విధంగా ప్రణాళికలను అమలు చేయాలన్నారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి చేయదగిన పనులను గుర్తించి ఆ అంచనాతో తొలి విడతలో పనులు పూర్తి చేయాలన్నారు. పుష్కరాల సందర్భంగా ఆలయ సమయంలో కూడా పుష్కర ఘాట్ల నిర్మాణం, అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. 2027 మార్చి 31 నాటికి తొలిదశ అభివృద్ధి పనులు పూర్తిచేసేందుకు లక్ష్యంగా పనిచేయాలన్నారు.








Leave a Reply