
(అమరావతి,న్యూస్ఇన్)
ఆంధ్రప్రదేశ్ లో ఈ తెల్లవారు ఝామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముందుగా వెళ్తున్న టిప్పర్ లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్ని ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. మార్కాపూరం జిల్లా రాయవరం సమీపంలో ఉన్న క్వారీల వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు ప్రైవేటు బస్సును మొత్తం అంటుకున్నాయి.బస్సులో 40 మంది ప్రయాణం చేస్తుండగా 10 మంది స్పాట్ లోనే అగ్నికి ఆహుతిఅయ్యారు. మరికొంత మంది గాయపడ్డారు. ఈ బస్సు తెలంగాణా నుంచి పామర్రు వెళుతుంది. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అగ్నికి బస్సు మొత్తం అహుతి కావడంతో…. ప్రమాద ఘటనను తెలియచేస్తోంది. ఈ ఘటనపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని నిర్ణయం తీసుకున్నాయి.




Leave a Reply