(బెంగుళూరు,న్యూస్ఇన్)
మన దేశంలో క్రికెట్ క్రేజీ రాజకీలను కుదిపేస్తోంది. ప్రజాప్రతినిధులు ఏమి తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. నేటి నుంచి మొదలయ్యే ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రాంచైజీలు తమ ఆటగాళ్లతో ఆయా నగరాలకు చేరుకుని గత కొన్ని రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇక మ్యాచ్ ల ముహూర్తం దగ్గర పడడంతో రాజకీయ నేతలు ఈ మ్యాచ్ లను ప్రత్యక్షంగా వీక్షించాలన్న లక్ష్యంగా ప్రయత్నాలు చేశారు. సాధారణ ప్రజలతో పోటీ పడి టికెట్లు కొనుకునే పరిస్థితులు లేకపోవడంతో రాజకీయంగా ఉండే ప్రోటోకాల్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రపు ఫీజులతో స్టేడియాలు నిర్వాహకులకు అప్పచెబుతున్నా….మంత్రులు, ఎమ్మెల్యేలు అంటే ఐపీఎల్ నిర్వాహకులకు లెక్కలేదన్న వాదనను తెరపైకి తెచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ అంశంకు చర్చకు రావడంతో…. ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందించాల్సి వచ్చింది. ఎమ్మెల్యేలు తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లేందుకు ఒక్కో మ్యాచ్ కు ఐదు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే అంశాన్ని సీఎం సిద్దరామయ్య ఫ్రాంచేజీల ప్రతినిథులతో చర్చలు జరిపి చివరి రెండు టికెట్లు ఇచ్చేందుకు అంగీకరించాయి.
సీఎం సిద్దు చర్చలు…..

గత ఏడాది ఐపీఎల్ ఛాంపియన్ గా రాయల్ ఛాలెంజర్ బెంగుళూరు జట్టు నిలవడంతో బెంగుళూరులో భారీ ప్రదర్శనను ఆ ఫ్రాంచైజీని నిర్వహించింది. భారీగా తరలి వచ్చిన ప్రజలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలం కావడంతో….. తొక్కిసలాటో 11 మంది క్రికెట్ అభిమానులు మృతి చెందారు. టికెట్ల పంచాయతీతో ఈ అంశాన్ని కూడా కొంత మంది నేతలు ప్రస్తావించారు. మరోవైపు కర్నాటక లో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా ప్రస్తావించడం విశేషం. రాజకీయాల్లోకి ఐపీఎల్ టికెట్ల పంచాయతీ…తీవ్ర చర్చకు దారి తీసింది. అసెంబ్లీలో చర్చలతో పాటు బహిరంగంగా కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు టికెట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ నేతలు కొంత మంది దీన్ని సమర్ధిస్తుండగా…మరికొంత ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక సౌకర్యలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ప్రజల ఓట్ల నుంచి ఎన్నికైన వారు ప్రజల మధ్యలో క్రికెట్ మ్యాచ్ లు వీక్షిస్తే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు.
సీఎం చర్చలు రెండు టికెట్లకు ఓకే…..

అయితే ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరిపినా….కేవలం రెండు టికెట్లు ప్రజాప్రతినిధులకు కేటాయించేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు అంగీకరించడం ఇక్కడ విశేషం. గత ఏడాది టికెట్ల పంచాయతీ హైదరాబాద్ ను కుదిపేసింది. గత హెచ్ సీ ఏ కార్యవర్గం టికెట్లు ఎక్కువ కావాలని డిమాడ్ చేయడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రభుత్వాన్ని దారికి తెచ్చుకునేందుకు ఇక్కడి నుంచి తరలి వెళ్తామన్న హెచ్చరికలు చేసింది. రాజకీయ కారణాలతో ప్రభుత్వం ఎస్ ఆర్ హెచ్ ను కొనసాగించేలా చర్చలు జరిపి టికెట్ల కేటాయింపు పై పూర్తి విచారణ ప్రభుత్వం జరిపింది. దీంతో గత కార్యవర్గం లో చైర్మన్ గా ఉన్న జగన్మోహన్ రావు సహా మరికొంత మంది కీలక వ్యక్తులు అరెస్టు దాకా పరిస్థితులు వెళ్లాయి.











Leave a Reply