NewsInn

News in a Click

నేటి నుంచి ఐపీల్ -19 సీజ‌న్ ప్రారంభం

నేటి నుంచి ఐపీల్ -19 సీజ‌న్ ప్రారంభం
  • RCB VS SRH మొద‌టి మ్యాచ్

(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్‌)

కొద్ది రోజుల క్రిత‌మే టీ-20 ప్ర‌పంచ్ క‌ప్ ప్ర‌పంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల‌ను ఉత్తేజ ప‌రిచింది. తాజాగా ఐపీఎల్ మ్యాచ్ లు నేటి నుంచి ప్రారంభం కాన్నారు. రెండు విడ‌త‌ల్లో జ‌రిగే ఈ మ్యాచ్ ల‌లో భాగంగా 74 మ్యాచ్ లు దేశంలోని వివిధ ప్ర‌ధాన న‌గ‌రాల్లో జ‌రుగ‌నున్నాయి. నేటి మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్ బెంగుళూరుతో స‌న్ రైజ‌ర్ హైద‌రాబాద్ జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది. బెంగుళూరులో జ‌రిగే ఈ మ్యాచ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇరు జ‌ట్ల‌లో కూడా కీల‌క ఆటగాళ్లపైనే ఆంద‌రి దృష్టి ఉంది. బెంగుళూరు జ‌ట్టులో భార‌త్ త‌ర‌పున ర‌న్ మిష‌న్ గా పేరున్న కొహ్లీ స‌హా మ‌రింత మంది ఆట‌గాళ్లు త‌మ స‌త్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఇక స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టులో ప్ర‌పంచ క‌ప్ లో రాణించిన ఇషాన్ కిష‌న్ తో పాటు హార్డ్ హిట్టింగ్ చేసే అభిషేక్ శ‌ర్మ మ‌రింత మంది విదేశీ ఆట‌గాళ్లు త‌మ ప్రాంఛైజీ త‌ర‌పున రంగంలోకి దిగ‌నున్నారు. 10 ఫ్రాంచైజీలు కోట్లాది రూపాయాల‌ను వెచ్చించి క్రీడాకారుల‌ను ద‌క్కించుకున్నాయి. ఎంతో మంది యువ క్రీడాకారుల నైపుణ్యం వెలుగు చూసేందుకు ఐపీఎల్ ఒక వేదిక‌గా మారింది. ఎంతో మంది అత్య‌త్తుమ క్రికెటర్లు ఏపీఎల్ లో సత్తా చాటి వెలుగులోకి వ‌చ్చారు. ఏప్రిల్ 28వ తేదీన మొద‌ల‌య్యే ఈ లీగ్ మ్యాచ్ ల ఫైన‌ల్ మే 31న బెంగుళూరులో జ‌రిగే ఫైన‌ల్ తో ముగియ‌నుంది.

స్టార్ ఆటగాళ్లు……….

ఐపీఎల్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లు పాల్గొంటారు. భారత ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా ఈ లీగ్‌లో తమ ప్రతిభను నిరూపించుకునే ప్ర‌య‌త్నిస్తారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని వంటి స్టార్ ఆటగాళ్లు అభిమానులకు ప్రత్యేక ఆకర్షణ. అదే సమయంలో యువ ఆటగాళ్లు కూడా తమ ఆటతో అందరినీ ఆకట్టుకుంటున్నారు.ఐపీఎల్ మ్యాచ్‌లు చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగుతాయి. చిన్న లక్ష్యాలను కూడా రక్షించడం, పెద్ద లక్ష్యాలను ఛేదించడం వంటి ఆసక్తికర ఘట్టాలు ఎన్నో చోటు చేసుకుంటాయి.

ఆధునిక టెక్నాల‌జీ….

ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రికెట్ లీగ్‌లలో ఒకటి. ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ల అమ్మకాలు ద్వారా భారీ ఆదాయం వస్తుంది. ఇది భారత దేశ‌ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. దేశీయ లీగ్ అయినా…. ప్ర‌పంచ స్థాయిలో గుర్తింపు ఉండ‌డంతో ఈ మ్యాచ్ ల‌కు అదే స్థాయిలో సాంకేతిక‌ను వినియోగిస్తారు.డీఆర్‌ఎస్, అల్ట్రా ఎడ్జ్, హాక్ ఐ వంటి టెక్నాలజీలు అంపైరింగ్ నిర్ణయాలను మరింత ఖచ్చితంగా అమ‌లు చేసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తాయి.

బెంగుళూరులో ఐపీఎల్ టికెట్ల పంచాయ‌తీ…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *