
(హైదరాబాద్,న్యూస్ఇన్)
గత కొన్ని రోజులుగా మండుతున్న ఎండలకు కాస్త ఉపశమనం లభించనుంది. వారం రోజులుగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే అధికంగా ఊష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగరేణి ప్రాంతంలో 45 డిగ్రీలకు సమీపంలో కూడా నమోదయ్యాయి. ఒక్క సారిగా పెరిగిన వేసవి తీవ్రతతో ప్రజలు అవస్థలు ఎదుర్కొన్నారు. మరో నాలుగు రోజులు పాటు ఎండలు ఉంటాయని ఇపపి వరకే ప్రకటించిన వెదర్ మెన్, ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రంలెని నాలు జిల్లాలో తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏప్రిల్ 18,19 తేదీల్లో ఊరుములతో కూడిన వర్షాలు కురవనున్నాయి. విరారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి , మెదక్ జిల్లాల్లో ఈ ప్రభావం 24 వ తేదీ వరకు కనిపించ నున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే వర్షాలు సాయంత్రం లేదంటే రాత్రి వేశల్లో కురిసే అవకాశం ఉండడంతో డే సమయంలో ఎండలు, ఉక్కవపోత కొనసాగే అవాకవశం ఉందని తెలుస్తోంది.










Leave a Reply