NewsInn

News in a Click

MI Vs PBKS మ్యాచ్ డీకాక్ విధ్వంసం

MI Vs PBKS మ్యాచ్ డీకాక్ విధ్వంసం

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌)

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ నిర్ణ‌యం ఆదిలో స‌రైన నిర్ణ‌యం అని అనిపించినా…ఆ త‌రువాత ఈ నిర్ణ‌యం త‌ప్పని తేలిపోయింది. ఎంఐ బ్యాట్స్ మెన్ క్వింట‌న్ డీకాక్ పంజాబ్ బౌల‌ర్ల‌పై వీర‌విహారం చేశారు. ఊహించ‌ని విధంగా విరుచుకు ప‌డ్డారు. కేవ‌లం ఫోర్లు, సిక్స‌లతో సెంచ‌రీ పూర్తి చేసుకున్నారు. ఈ సీజ‌న్ ఐపీఎల్ లో తొల‌సెంచ‌రీని డీకాక్ న‌మోదు చేసుకున్నారు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ముంబాయి జ‌ట్టు 6 వికెట్లు న‌ష్టపోయి 195 ప‌రుగులు చేసింది. పంజాబ్ విజ‌య ల‌క్ష్యాన్ని 196 ప‌రుగుల‌కు నిర్దేశించింది.

ముంబాయి ఇండియ‌న్స్ బ్యాటింగ్ మొద‌లు పెట్టిన రెండో ఓవ‌ర్లోనే రెండు కీల‌క వికెట్ల‌ను కోల్పోయింది. రియ‌న్ రికెల్ట‌న్, డికాక్ లు ఇన్నింగ్స్ మొద‌లు పెట్టారు. డీకాక్ ముందు నుంచే అటాకింగ్ మోడ్ లో వెళ్ల‌గా రికెల్ట‌న్ ఆచి తూచి అడారు. అర్ష‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవ‌ర్లో రికెల్ట‌న్ తొలివికెట్ గా జ‌ట్టు స్కోరు 12 ప‌రుగుల వ‌ద్ద ఔట‌య్యారు. ఆ త‌రువాత వ‌చ్చి రాగానే భారీ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నించి పేలవ ఫాంలో ఉన్న సూర్య కూడా ప‌రుగులేమి చేయ‌కుండానే వెనుదిరిగారు. హ్యాట్రిక్ చాన్స్ అర్ష‌దీప్ కు వ‌చ్చినా… నుమ‌న్ ధీర్ దాన్ని అడ్డుకున్నారు.

మ‌రో వైపు జోరుమీదున్న డికాక్, నుమ‌న్ ధీర్ లు ముంబాయి ఇన్నింగ్ ను చ‌క్క దిద్దారు. ప‌వ‌ర్ ప్లేలో త‌క్కువ ప‌రుగులే రాబ‌ట్టినా ఆ త‌రువాత గేరు మ‌ర్చా బ్యాటింగ్ చేయ‌డంతో ముంబాయి ఇండియ‌న్స్ భారీ స్కోరు దిశ‌గా ప‌రుగులు రాబ‌ట్టుకుంది. నుమ‌న్ ఇచ్చిన సునాయ‌స క్యాచ్ ను చాహ‌ల్ విడిచి పెట్ట‌డంతో పంజాబ్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వ‌చ్చింది.కేవలం 31 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 3 సిక్స్ ల‌తో 50 ప‌రుగుల‌ను నుమ‌న్ చేశారు. 3వ వికెట్ రూపంలో ముంబాయి 134 ప‌రుగుల వ‌ద్ద కోల్పోయింది. 13. 4 ఓవ‌ర్ల‌లోనే ఈ స్కోరును ముంబాయి చేసింది. హ‌ర్దిక్, డికాక్ లు స్కోరు పెంచే ప్ర‌య‌త్నం చేశారు.

హ‌ర్దిక్ కేవ‌లం 12 ప‌రుగులు మాత్ర‌మే చేసి నాలుగో వికెట్ రూపంలో వెనుదిరిగారు. 175 ప‌రుగుల వ‌ద్ద హ‌ర్ధిక ఔట్ కావ‌డంతో డీకాక్ కు రూథ‌ర్ ఫ‌ర్డ్ కేవ‌లం ఐదు బంతులు ఎదుర్కొని ఒకే ప‌రుగు చేసి అర్ష‌దీప్ బౌలింగ్ లో వెనుదిరిగారు. తిల‌క్ వ‌ర్మ కూడా వెంట‌నే రనౌట్ అయ్యారు. ఇన్నింగ్స్ లో 60 బాల్స్ ఎదుర్కొన్న డీకాక్ 112 ప‌రుగులు చేశారు. 8 ఫోర్లు,7 సిక్స‌ల్ ల‌తో ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. మ‌యాంక్ రావ‌త్ లు నాటౌట్ గా ఉన్నారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష‌దీప్ 3 వికెట్లు తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *