NewsInn

News in a Click

ఉద‌యం ఎండ‌లు – సాయంత్రం వాన‌లు…..!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణాలో భిన్న‌మైన వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఊష్ణోగ్ర‌త‌లు దాదాపు 45 డిగ్రీల వ‌ర‌కు న‌మోద‌య్యాయి. ఎండ వేడి, ఉక్క‌పోత‌తో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఊష్ణోగ్ర‌త‌ల్లో ఎలాంటి మార్ప‌లు లేక‌పోయినా….నేటి సాయంత్రం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీగాఉరుములు, మెరుపుల‌తో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వెద‌ర్ మెన్ ప్ర‌క‌టించారు.
మధ్యాహ్నం త‌రువాతి నుంచి రాత్రి వరకు సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో తీవ్రమైన తుఫాను ప్ర‌భావంతో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించారు. హైదరాబాద్ – మధ్యాహ్నం వరకు 41-42°C ఉష్ణోగ్రతలు నమోదైన తర్వాత, సాయంత్రం నుండి రాత్రి వరకు చెదురుమదురుగా తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే కొన్ని రోజుల పాటు వ‌ర్షాలు ఇదే విధంగా రాష్ట్రాంలోని అన్ని ప్రాంతాల్లో నెల‌కొనే అవ‌కాశం ఉంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *