(మెదక్,న్యూస్ఇన్)
ఉద్యోగాలు ఎక్కడైనా చేసేందుకు యువకులు సిద్ధంగా ఉండాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి యువతకు సూచించారు. ఉద్యోగం వచ్చిన తరువాత సమీప ప్రాంతంలో ఉండాలని ఎంతో మంది పైరవీల కోసం తిరుతారని, ఇలాంటి ప్రయత్నాలు చేయరాదన్నారు. దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తూ తెచ్చుకునే అనుభవం భవిష్యత్తులో పనికి వస్తుందన్నారు. ఈ సందర్భంగా యువతతో మాట్లాడుతూ తన సొంత అనుభవాన్ని గుర్తు చేశారు. తనకు ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడు నర్స్ గా పనిచేసే జగ్గారెడ్డి తల్లి జమాయమ్మ జిల్లా లోని మారుమూల ప్రాంతాల్లో ఎలా పనిచేసేదో.. రవాణా సౌకర్యాలు సరిగా లేని ఆరోజుల్లో ఎలా విధులకు హాజరయ్యేదో యువకులకు జగ్గారెడ్డి వివరించి చెప్పారు. ఈ రోజుల్లో దూరం వెళ్లి ఉద్యోగాలు చేసేందుకు కూడా యువత ఆలోచిస్తోందన్నారు. ఉద్యోగం ప్రారంభించిన తొలినాళ్ళ లో మారుమూల ప్రాంతాల్లో పని చేయాలని, తద్వారా కొత్త అనుభవాలు వస్తాయని, ఆ అనుభవాలు వారి ఉద్యోగ జీవితం లో ఉపయోగపడతాయని జగ్గారెడ్డి హితవు పలికారు.














Leave a Reply