(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ RR బ్యాటింగ్ లో తడబడింది. ఓపెనర్లు శుభారంభాన్ని అందించినా… ఆ తరువాత బ్యాటర్లు క్రమంగా వెనుతిరుగడంతో ఆశించిన స్కోరు చేయలేకపోయింది. కేకేఆర్ జట్టు మందు 156 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఈ సీజన్ లోనే అద్భుతమైన ఫాంలో ఉన్న ఆర్ ఆర్ బ్యాటర్లు యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లే లో వికెట్ కోల్పోకుండానే 60కి పరుగులు రాబట్టారు. తొలికెట్ రూపంలో వైభవ్ సూర్యవంశీ 28 బంతుల్లో 46వ పరుగులు చేసి జట్టు స్కోరు 81 పరుగుల వద్ద ఔటయ్యారు.

ఆ తరువాత కొద్ది సేపటికే వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన ధృవ్ జురేల్ కూడా 97 పరుగుల వద్ద రెండో వికెట్ రూపంలో వెనుదిరిగారు. 99 పరుగుల వద్ద 3వికెట్ రూపంలో వైభవ్ సూర్యవంశీ కూడా పెవీలియన్ చేరుకున్నారు.రాజస్థాన్ రాయల్స్ కెప్టన్ ఈ మ్యాచ్ లో కూడా మరోసారి విఫలం అయ్యారు. 117 పరుగల వద్ద పరాగ్, 124 పరుగల వద్ద ఫెరిరా లు 16 ఓవర్లలోపే ఔటయ్యారు. దీంతో జట్టు బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు ఇబ్బందులు పడ్డారు.

పవర్ ప్లేలో భారీగా పరుగులు రాబట్టిన ఆర్ ఆర్ బాటర్లు, ఆ తరువాత అదే స్థాయిలో పరుగులు రాబట్టంలో విజయవంతం కాలేదు.19వ ఓవర్ తొలి బంతికే రవీంద్ర జడేజా 9 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆశించిన పరుగులు రాబట్టలేకపోవడంతో కేకేఆర్ బౌలర్లు కట్టడం చేయడంలో విజయవంతం అయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, త్యాగి 3 వికెట్లు తీసి మంచి బ్రేక్ త్రూ ఇచ్చారు. రెండు వరుస ఓవర్లలో కీలక బ్యాట్స్ మెన్లను వరుణ్ ఔట్ చేశారు. సునిల్ నరేన్ రెండు వికెట్లు తీసుకున్నారు.











Leave a Reply