(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
కేకేఆర్ తన తొలి గెలుపు రుచి చూసింది. ఈ ఐపీఎల్ సీజన్ లో తొలిసారి ఆర్ ఆర్ జట్టుపై విజయం సాధించింది. తడబడుతూ బ్యాటింగ్ చేసి చివరికి విజయం దక్కించుకుంది. రింకూసింగ్, అంకుల్ రాయ్ లు జట్టు గెలుపులో కీలక ఇన్నింగ్స్ ఆడారు.
కోల్ కత్తా హోం గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో 156 పరుగల విజయలక్ష్యంతో బరిలో దిగిన KKR బ్యాటింగ్ మొదలు పెట్టి వికెట్లు వరుసగా కోల్పోయింది. పవర్ ప్లేలోనే కోల్ కత్తాపై రాజస్థాన్ రాయల్స్ ఆధితప్యం తెచ్చుకున్నారు. కీలక వికెట్లు పడగొట్టి తమకే విజయం దక్కుతుందన్న ధీమాతో మ్యాచ్ లో ఆర్ ఆర్ ఆటగాళ్లు వ్యవహరించారు. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి బంతికే టీం సెల్ప్రిట్ ఔటయ్యారు. ఐదు పరుగల వద్ద అజింక్యా రహానే వెనుదిరిగారు. 37 పరుగుల వద్ద 4.3 ఓవర్లలో కెమరూన్ గ్రీన్ కూడా ఔట్ కావడంతో ఆర్ ఆర్ కు గెలుపుపై భారీగా ఆశలు పెరిగాయి.

ఆ తరువాత 15 పరుగులు మాత్రమే జోడించి రఘువంశీ 52 పరుగుల వద్ద 7వ ఓవర్ చివరి బంతికి వెను దిరిగారు. 11 ఓవర్ తొలి బంతికే పావెల్ ఔటయ్యారు. వీరిలో గ్రీన్ 27, పావెల్ 23 పరుగులు స్కోరు అత్యధికం. 14 ఓవర్ లో మరో వికెట్ ను కేకేఆర్ కోల్పోవడంతో…. ఆ జట్టు మరింత కష్టాల్లో పడింది.రమణ్ దీప్ సింగ్ 85 పరుగుల వద్ద ఔటయ్యారు.రాజస్థాన్ బౌలర్లు కోల్ కొత్త బ్యాట్స్ మెన్లపై క్రమంగా వత్తిడి పెంచుతూ వికెట్లు తీయడంతో కోల్ కోత్తా బ్యాటర్లు ఆత్మరక్షణతో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీసుకోగా మిగిలిన బౌలర్లు తలా ఒక వికెట్ ను రాబట్టారు. రింకూ సింగ్, అంకుల్ రాయ్ తో కలిసి గెలుపు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. 20 పరుగుల స్కోరు వద్ద రింకూ ఇచ్చిన సులువైన క్యాచ్ ను ఆర్ ఆర్ వదిలి పెట్టడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. చివరి 3 ఓవర్లలో కేవలం 28 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండడం, రింకూ క్రీజులో ఉండడంతో కోల్ కొత్త ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. చివరి ఓవర్ లో 9 పరుగులు మాత్రమే విజయానికి కావాల్సి వచ్చాయి. తొలి బంతికి ఫోర్ రాబట్టడంతో కోల్ కొత్త విజయానికి మరింత చేరువైంది. రెండో బంతికి మరో ఫోర్ కొట్టి రింకూ స్కోరును సమం చేశారు. ఆ తరువాత మరో 4 కొట్టి ఆర్ ఆర్ పై 4 వికెట్ల తెడాతో విజయం దక్కించుకుంది.ఈ మ్యాచ్ లో వీరిద్దరి భాగస్వామ్యమే కోల్ కత్త గెలుపుకు కారణమైంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ RR బ్యాటింగ్ లో తడబడింది. ఓపెనర్లు శుభారంభాన్ని అందించినా… ఆ తరువాత బ్యాటర్లు క్రమంగా వెనుతిరుగడంతో ఆశించిన స్కోరు చేయలేకపోయింది. కేకేఆర్ జట్టు మందు 156 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఈ సీజన్ లోనే అద్భుతమైన ఫాంలో ఉన్న ఆర్ ఆర్ బ్యాటర్లు యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లే లో వికెట్ కోల్పోకుండానే 60కి పరుగులు రాబట్టారు. తొలికెట్ రూపంలో వైభవ్ సూర్యవంశీ 28 బంతుల్లో 46వ పరుగులు చేసి జట్టు స్కోరు 81 పరుగుల వద్ద ఔటయ్యారు.ఆ తరువాత కొద్ది సేపటికే వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన ధృవ్ జురేల్ కూడా 97 పరుగుల వద్ద రెండో వికెట్ రూపంలో వెనుదిరిగారు. 99 పరుగుల వద్ద 3వికెట్ రూపంలో వైభవ్ సూర్యవంశీ కూడా పెవీలియన్ చేరుకున్నారు.రాజస్థాన్ రాయల్స్ కెప్టన్ ఈ మ్యాచ్ లో కూడా మరోసారి విఫలం అయ్యారు. 117 పరుగల వద్ద పరాగ్, 124 పరుగల వద్ద ఫెరిరా లు 16 ఓవర్లలోపే ఔటయ్యారు. దీంతో జట్టు బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు ఇబ్బందులు పడ్డారు.

పవర్ ప్లేలో భారీగా పరుగులు రాబట్టిన ఆర్ ఆర్ బాటర్లు, ఆ తరువాత అదే స్థాయిలో పరుగులు రాబట్టంలో విజయవంతం కాలేదు.19వ ఓవర్ తొలి బంతికే రవీంద్ర జడేజా 9 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆశించిన పరుగులు రాబట్టలేకపోవడంతో కేకేఆర్ బౌలర్లు కట్టడం చేయడంలో విజయవంతం అయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, త్యాగి 3 వికెట్లు తీసి మంచి బ్రేక్ త్రూ ఇచ్చారు. రెండు వరుస ఓవర్లలో కీలక బ్యాట్స్ మెన్లను వరుణ్ ఔట్ చేశారు. సునిల్ నరేన్ రెండు వికెట్లు తీసుకున్నారు.ముందు బ్యాటింగ్ చేసిన ఆర్ ఆర్ కూడా తడబడి…











Leave a Reply