(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం హైకమాండ్ను సంతోషపెట్టడానికే ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, హామీల అమలులో విఫలమై రాష్ట్ర ప్రజలను చీట్ చేస్తూ “పిక్ పాకెటర్”లా వ్యవహరిస్తున్నారని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే తీవ్రంగా మండిపడ్డారు.తెలంగాణలో కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై, ప్రజలకు చేసిన అన్యాయం పట్ల రేవంత్ సర్కారు పై నిప్పులు చెరిగారు. గత ఎన్నికల సమయంలో మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఆసరా పెన్షన్ల పెంపు, పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం వంటి ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని మోసం చేయడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందని విమర్శించారు.

పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ తీరు పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని విమర్శించారు. మహిళలకు స్వరం ఉందని, వారికి చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించి, నిర్ణయాత్మక ప్రక్రియలో భాగస్వాములను చేసినప్పుడే సమాజానికి న్యాయం జరుగుతుందని, మహిళలను వంచించిన కాంగ్రెస్, ఇండీ అలయెన్స్ పార్టీలు దేశ ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకోలేరని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే హెచ్చరించారు.
కాంగ్రెస్ లో వారసత్వ రాజకీయాలే…
కాంగ్రెస్ నాయకత్వం గురించి మాట్లాడుతూ, ఆ పార్టీలో కేవలం “ఖాన్దాన్” (వారసత్వ) రాజకీయాలే నడుస్తాయని, కర్ణాటక లో జార్కిహోళి కుమార్తెకు టికెట్ ఇవ్వడాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో తనను తాను “జాదూగర్” (మాంత్రికుడు) అని సంబోధించుకుంటూ అపరిపక్వంగా ప్రవర్తించారని విమర్శించారు.











Leave a Reply