NewsInn

News in a Click

చ‌ర్చ‌లు విఫ‌లం- స‌మ్మె య‌ధాత‌థం

చ‌ర్చ‌లు విఫ‌లం- స‌మ్మె య‌ధాత‌థం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ఆర్డీసీ కార్మిక జేఏసీ నిర్ణ‌యం మేర‌కు స‌మ్మె అనివార్యం అయింది. ఆర్టీసీ కార్మికులు నేటి అర్ధ‌రాత్రి నుంచి స‌మ్మెకు వెళ్లేందుకు సిద్ధంమ‌ని ప్ర‌క‌టించారు. ఈ నెల 22వ తేదీ నుంచి స‌మ్మె కు వెళ్తామ‌ని ఆర్టీసి కార్మ‌కులు నోటీసులు ఇచ్చినా…. ప్ర‌భుత్వం ఆర్టీసీ కార్మికుల‌తో ఒక రోజు ముందుగా చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించింది. ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిటీ మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలో కార్మిక సంఘాల జేఏసీ నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపింది. అధికారుల క‌మిటీ జ‌రిపిన చ‌ర్చ‌లు స‌ఫ‌లం కాక‌పోవ‌డంతో స‌మ్మె య‌ధాత‌థంగా ఉంటుంద‌ని జేఏసీ నేత‌లు ప్ర‌క‌టించారు. నేటి అర్ద‌రాత్రి నుంచి సమ్మె…..

చ‌ర్చ‌ల అనంత‌రం ఆర్టీసీ కార్మిక సంఘాల నేత‌లు మాట్లాడుతూ సమ్మె నోటీసులు ఇచ్చి 41 రోజులు అవుతుందని, 41 రోజుల తర్వాత ప్రభుత్వం చర్చలకు పిలిచిందన్నారు. మా డిమాండ్లు అన్ని పాత డిమాండ్లే అని తెలిపారు. ఐఏఎస్ అధికారుల కమిటీ వేసి చర్చలు అనడం కరెక్ట్ కాదని కార్మిక సంఘాల నేత‌లు అభిప్రాయం వ్య‌క్తం చేశారు. కార్మిక జేఏసీ మా డిమాండ్లను పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు. చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేసిందన్నారు. అర్థరాత్రి నుంచి సమ్మె కొనసాగుతుందని,ఎవరి ఒత్తిళ్లకు మేము త‌లొగ్గేది లేద‌ని ప్ర‌క‌టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *