(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
అభిషేక్ ఇన్నింగ్స్ ఎస్ఆర్ హెచ్ అభిమానులను అలరించింది. అభిషేక్ ఇన్నింగ్స్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు అసలైన మజా అందించింది. వేలాది ప్రేక్షకుల మధ్య ఎస్ ఆర్ హెచ్ స్థానిక స్టేడియంలో ఫోర్లు, సిక్స్ లతో అభిమానుల్లో మరింత జోష్ పెంచారు. అభిషేక్ సెంచరీతో ఆరేంజ్ క్యాప్ లో రేస్ లో తొలి స్థానానికి చేరుకున్నారు. మ్యాచ్ మొదలైన వెంటనే ఫోర్లు, సిక్స్ ల వర్షం అభిషేక్ నుంచి మొదలైంది. ఉప్పల్ స్టేడియం అసలైన జోష్ హైదరాబాద్ అభిమానుల్లో జోష్ నింపింది. అభిషేక్ శర్మ 66 బంతుల్లో 10 సిక్స్ లు,9 ఫోర్లతో 130 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.ఎస్ ఆర్ హెచ్ 20 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 242 పరుగులు చేసింది. 243 పరుగుల విజయ లక్ష్యంగా బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించినా విజయం దక్కించుకోలేకపోయింది. 47 పరుగులతో ఎస్ ఆర్ హెచ్ ఢిల్లీ క్యాపిటల్సో పై విజయం దక్కించుకుంది.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓపెనింగ్ జోడి మరోసారి శుభారంభం అందించింది. అభిషేక్ శర్మ- ట్రావిస్ హెడ్ లు తొలి ఓవర్ నుంచే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లపై విరుచుకు పడ్డారు. తొలి ఓవర్ నుంచే సగటున పది పరుగుల రన్ రేట్ కు తగ్గకుండా పరుగులు చేయాలన్న లక్ష్యంగా బ్యాటింగ్ మొదలు పెట్టారు.9 ఓవర్లలోనే వీరి భాగస్వామ్యం 97 పరుగులు చేసింది. ఈ స్కోరు వద్ద ట్రావిస్ హెడ్ 26 బంతులు ఎదుర్కొని 37 పరుగులు చేశారు. 2 ఫోర్సు, 2 సిక్స్ ల సహాయంతో చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో సమీర్ రజ్వీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు.

అప్పటికీ క్రీజుల్లో ఫోర్లు, సిక్స్ లతో ఢిల్లీ బౌలర్లపై వీరవిహారం చేస్తున్న అభిషేక్ దాన్ని అదే విధంగా కొనసాగించారు. కెప్టన్ ఇషాన్ కిషన్ కూడా అదే జోరుతో బ్యాటింగ్ మొదలు పెట్టడంతో ఎస్ ఆర్ హెచ్ బ్యాటింగ్ లో జోరు పెరిగింది. ఈ ఐపీఎల్ సీజన్ లో తొలి సెంచరీని అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో సాధించారు. వీరి భాగస్వామ్యం 15 ఓవర్లలో 176 పరుగులకు స్కోరు చేరుకుంది. అక్కడ ఇషాన్ కిషన్ సమన్వయ లోపంతో 13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ సహాయంతో 25 పరుగులు చేసి వెనుదిరిగారు. ఆ తరువాత అభిషేక్ కు క్లాసెన్ తోడయ్యారు. క్లాసెన్ 13 బాల్స్ ఎదుర్కొని 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 37 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. ఢిల్లీ క్యాపిటల్స్ విజయ లక్ష్యం 243 పరుగులుగా నిర్దేశించింది.
సన్ రైజర్స్ హోం గ్రౌండ్స్ లో జరిగిన మ్యాచ్ లో పూర్తి ఆధిక్యతతో ఎస్ ఆర్ హెచ్ విజయం దక్కించుకుంది. 243 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ముందుగా బ్యాటింగ్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ముందు ఉంచింది. ఈ స్కోరు ఛేదనలో వత్తిడి పెరిగిన ఢిల్లీ బ్యాటర్లు 20 ఓవర్ల వరకు ఎస్ ఆర్ ఎస్ కు ధీటుగా బ్యాటింగ్ చేశారు. కేవలం ఒక వికెట్ కోల్పోయి వంద వరకు స్కోరును తీసుకెళ్లారు తొలి వికెట్ రూపంలో పాతుం నిసాంక 8 పరుగులు చేసి జట్టు స్కోరు 21 పరుగుల వద్ద ఔటయ్యారు. ఆ తరువాత లోకేష్ రాహుల్, నితీష్ రాణాలు స్కోరును పెంచే బాధ్యతలు తీసుకుని ఎస్ ఆర్ హెచ్ కు ధీటుగా పరుగులు రాబట్టారు. బౌలర్ ఎవరైనా పరుగులు పిండుకునే ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యారు. 10 వ ఓవర్ చేరుకునే సరికి ఢీల్లీ జట్టుకు రిక్వైర్ రన్ రేట్ పెరుగుతూ వచ్చింది. అందుకు అనుగుణంగా పరుగులు రాబట్టే ప్రయత్నంలో రాహూల్37 పరుగులు చేసి ఔటయ్యారు.

ఆ తరువాతి ఓవర్ లోనే డేవిడ్ మిల్లర్ కూడా పరుగులు ఏమి చేయకుండానే వెనుదిరగడంతో ఢిల్లీ ఇబ్బందుల్లో పడింది. 11 ఓవర్ ముగిసే వరకు 107 పరుగులతో ఉన్న ఢిల్లీ ఆ తరువాత కోలుకోవడం బ్యాటర్లకు మరింత ఇబ్బంది కరంగా మారింది. జోరు మీద కనిపించిన స్టబ్స్ 16 బాల్స్ లో 27 పరుగులు చేసి ఔటయ్యారు. దీంతో16 ఓవర్లలో 166 పరుగులు సాధించిన విజయం సాధించడం మాత్రం కష్టంగా మారింది. ఇషాన్ మలింగా 4 వికెట్లు తీసుకుని ఢిల్లీ కీలక బ్యాటర్లను ఔట్ చేసి ఎస్ ఆర్ హెచ్ ను పూర్తి ఆధిపత్యంలోకి తెచ్చారు.హర్ష్ దుబే 3 వికెట్లు తీసుకున్నారు. ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేయగలిగింది.








Leave a Reply