(హైదరాబాద్,న్యూస్ఇన్)
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్ ను మూఢ నమ్మకాలు చుట్టుమడుతున్నాయా… ఆధునిక యుగంలో కూడా మూఢ నమ్మకాలకు కార్పోరేట్ సంస్థలు ప్రాధాన్యత ఇస్తున్నాయా….అన్న అనుమానాలు పెద్ద ఎత్తు దూమారం రేపుతున్నాయి. శనివారం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ విజయం దోబూచు లాండింది. చివరివరకు ఉత్కంఠ వరకు సాగిన మ్యాచ్ లో చెన్నై అనుకున్న స్థాయిలో పరగులు సాధించలేక ఓడిపోయింది. ఇది సాధారణంగా అందరికీ కనిపించే దృష్యం…..మ్యాచ్ అనంతరం అసలు కథ చెన్నై యాజమాన్యం మొదలు పెట్టింది.

తమ ఓటమిని బ్లాక్ మ్యాజిక్ కారణమన్న వాదనను తెరపైకి తెచ్చి బీసీసీఐకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు లేఖ బయటకు రావడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. మరో వైపు ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై జట్టు ఆటగాళ్ల ఒడిదొడుకుల గురించి దృష్టి పెట్టకుండా బ్లాక్ మ్యాజిక్ తమ ఓటమికి ప్రధాన కారణమని వివరించడం కొత్త చర్చకు దారి తీస్తోంది.
లేఖలో ఏముంది?
ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా కొంతమంది ప్రేక్షకులు అసాధారణ ప్రవర్తనకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. చేతి సంకేతాలు చేయడం, విచిత్ర గుర్తులు గీయడం, నల్లని బట్టలు ఉపయోగించడం వంటి చర్యలు చేసినట్టు లేఖలో పేర్కొంది. సోషల్ మీడియాలో ఈ వీడియో లు వైరల్ కూడా అయ్యాయి. ఈ చర్యల తర్వాత సీఎస్కే ఆటగాళ్ల ప్రదర్శనలో అకస్మాత్తుగా పడిపోయిందని, వికెట్లు వరుసగా కోల్పోయాయని లేఖలో ప్రస్తావించారు. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం అంటూ దీనిపై విచారణ జరుపాలని బీసీసీని కోరింది.
అపోహలు…..
క్రీడల్లో ఓటమి లేదా విజయాన్ని మూడనమ్మకాలతో అనుసంధానం చేయడం కొత్త విషయం కాదు. చాలా మంది ఆటగాళ్లు ధరించే డ్రెస్ లలో లక్కీ నంబర్లు వేసుకుంటారు.వారి అభిమానులు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తుంటారు. ఒక ప్రొఫెషనల్ క్రికెట్ మ్యాచ్లో బ్లాక్ మాజిక్ వంటి అంశాలను ఓటమికి కారణంగా చూపించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.SRH విజయం…
లేఖపై అనుమానాలు…..
చెన్నై సూపర్ కింగ్స్ లెటర్ హెడ్ పై బయటకు వచ్చిన ఈ లేఖపై ఎన్నో అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఐపీఎల్ లో ఓటమి తరువాత ఇలాంటి లేఖలు కార్పోరేట్ సంస్థలు ఎలా విడుదల చేస్తాయన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఓటమిని అంగీకరించకుండా మఢనమ్మకాలను పెంచేలా ఉందని కొంత మంది విమర్శిస్తుండగా……ఇది యాజమాన్యం రాసిన లేఖ కాదని మరికొంత మంది వాదన. ఇలాంటి లేఖలు క్రికెట్ ను హాస్యాస్పదం చేస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ లేఖపై అధికారికంగా బీసీసీఐ స్పందించలేదు.











Leave a Reply