NewsInn

News in a Click

ఆర్టీసి కార్మికుల స‌మ్మె-ఆగిన బస్సులు

ఆర్టీసి కార్మికుల స‌మ్మె-ఆగిన బస్సులు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

నేటి ఆర్ధ‌రాత్రి నుంచి ఆర్టీసి కార్మికులు స‌మ్మె బాట పట్టారు. ప్ర‌భుత్వానికి స‌మ్మె నోటీసు ఇచ్చినా ప్ర‌భుత్వం కార్మిక సంఘాల‌తో మంగళవారం చర్చలు జరిపింది. చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో మంగళవారం నుంచి ఆర్టీసీ కార్మికులకు సమ్మె బాట పట్టారు. దీంతో రాష్ట్రంలో సుమారు 40 వేల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. అతి తక్కువ సంఖ్యలో ప్రైవేటు ఆపరేటర్ల బస్సులునడుస్తున్నాయి. ఆర్టీసీ సిటీ బస్సు లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆటోలు ఎక్కువగా చార్జ్ వసూలు చేస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాలను ప్రజలు ఆశ్రయిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ తీరును కార్మిక సంఘాలు త‌ప్పుబ‌డుతున్నాయి. సమ్మెను విజయవంతం చేసేందుకుప‌ లు కార్మిక సంఘాలు ఏక‌మై జేఏసిగా ఏర్ప‌డ్డాయి. ఆర్టీసీ జేఏసీ ఆధ్వ‌ర్యంలో కార్మిక సంఘాలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే ప్రైవేటు ఆప‌రేట‌ర్లు మాత్రం స‌మ్మెకు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఆర్టీసి కార్మికులు స‌మ్మె బాట ప‌డితే…ఎలాంటిచ‌ర్య‌లు తీసుకోవాల‌న్న దానిపై ప్ర‌భుత్వం కూడా ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్ల‌పై దృష్టి పెట్టింది. ఈ రోజు సాయంత్రం వ‌ర‌కు ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జ‌రిపి ఎలాంటి నిర్ణ‌యం వెల్ల‌డించ‌క‌పోతే ఆర్టీసి స‌మ్మె ఖాయంగా క‌నిపిస్తోంది. ఈతాము చేప‌ట్టే స‌మ్మె స‌క‌ల జ‌నుల స‌మ్మెను త‌ల‌పిస్తుంద‌ని ఆర్టీసి కార్మిక సంఘాలు ప్ర‌క‌టిస్తున్నాయి. ప్ర‌భుత్వం మొండి గా వ్య‌వ‌హ‌రించి బ‌స్సుల‌ను న‌డిపించే ప్ర‌య‌త్నాలు చేస్తే ఎలా అడ్డుకోవాలో కూడా త‌మ‌కు తెలుసని ఆర్టీసి కార్మిక సంఘాల నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు. ఆర్టీసి స‌మ్మెకు క‌ల్వ‌కుంట్ల క‌విత సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఆర్టీసిని ప్రైవేటు ప‌రం చేయాల‌ని ప్ర‌భుత్వం కుట్ర చేస్తోంద‌ని ఆరోపించారు.

Rtc busses at Bus Depo

ఉదయం నుంచే బస్టాండ్‌ల వద్ద ప్రయాణికుల పడిగాపులు దృశ్యాలు కనిపించాయి. హైదరాబాద్‌లోని ప్రధాన బస్టాండ్‌లలో అద్దె బస్సులను ప్రభుత్వం నడిపిస్తోంది. అద్దె బస్సులను ఆర్టీసీ జేఏసీ అడ్డుకోకుండా ప్రధాన బస్టాండ్‌ల వద్ద భారీగా పోలీసులను మొహరించింది.ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్న ప్రయాణికులు.ఈ రోజు మరోసారి చర్చలకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. ఆర్టీసీ కార్మికులు 32 డిమాండ్లతో ప్రభుత్వం ముందు ఉంచారు.

పలు డిపోల ముందు కార్మికుల ఆందోళన చేస్తున్నారు.సికింద్రాబాద్ స్టేషన్ వద్ద బస్సులు లేకపోవడంతో ప్రయాణికుల ఆందోళన చేశారు.కిటకిటలాడుతున్న మెట్రో రైళ్లు,సెట్విన్ బస్సులు ఇదే అవకాశంగా సెట్విన్ బస్సుల్లో ధరలు పెంచారు.ప్రయాణికుల నుంచి అధిక డబ్బులు ఆటో డ్రైవర్లు వసూలు చేస్తున్నారు.

విధులకు హాజరు కావాలి….

సంస్థ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని విధులకు హాజరుకావాలని ఎండీ నాగిరెడ్డి ఆర్టీసీ కార్మికులను కోరారు. కార్మికుల డిమాంద్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.

ప్ర‌ధాన డిమాండ్లు……

1.TGSRTC ని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేస్తు డేటాఫ్ అపాయింట్మెంట్ ను ప్రకటించాలి.

2.యూనియన్లను పునరుద్ధరించాలని

2021, 2025 వేతన సవరణలు వెంటనే జరపాలని
4.TGSRTC లో కాంటాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొని నడపాలని,*

5.స్టాఫ్ చిల్డ్రన్స్ ఉద్యోగులను మూడు సంవత్సరాల కాంట్రాక్టు పద్ధతిని రద్దుచేసి రెగ్యులర్ ప్రాతిపదికన తీసుకోవాలని,*

6.చట్ట వ్యతిరేక డ్యూటీలు తీసివేయాలి

7.MTW యాక్ట్ ను అమలు చేయాలి

8.ఆర్టీసీలో కార్మికులు 7, 8 గంటలకు బదులుగా 14, 16 గంటలు డ్యూటీ చేయిస్తు వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు….. వెంటనే కార్మికులపై పని భారాన్ని తగ్గించాలి.

9.రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని, రిటైర్మెంట్ అయిన రోజె మొత్తం డబ్బులు చెల్లించాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *