NewsInn

News in a Click

ఏపీలో మ‌ళ్లీ మొద‌లైన ఎండ‌లు ఎఫెక్ట్

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో ఎండలు తీవ్రమయ్యాయి. వడగాల్పులు హడలెత్తిస్తున్నాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 202 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఇవాళ కడపలో గరిష్ఠంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొన్నారు. రేపు 95 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 101 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 19, విజయనగరంలో 24, పార్వతీపురం మన్యం జిల్లాలో 3, అల్లూరి జిల్లాలో 5, పోలవరంలో 8, విశాఖపట్నంలో 1, అనకాపల్లిలో 13, కాకినాడలో 10, తూర్పుగోదావరి జిల్లాలో 6, ఏలూరులో 3, ఎన్టీఆర్ జిల్లాలో 3మండలాల్లో తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *