NewsInn

News in a Click

తెలంగాణా జ‌న జాగృతి పార్టీ – రేపే ఆవిర్భావం

తెలంగాణా జ‌న జాగృతి పార్టీ – రేపే ఆవిర్భావం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణా రాజ‌కీయాల్లో మ‌రో కొత్త రాజ‌కీయ పార్టీకి శనివారం ఆవిర్భ‌వించ‌నుంది. మాజీ సీఎం కేసీఆర్ కూతురు క‌ల్వ‌కంట్ల క‌విత ఈ పార్టీని ప్రారంభించ‌బోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణా జాగృతి పేరుతో కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న క‌విత కొత్త పార్టీతో త‌న రాజ‌కీయంగా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. లిక్క‌ర్ కేసులో జైలు నుంచి బేయిల్ పై వ‌చ్చిన క‌విత‌ బీఆర్ ఎస్ పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై రాసిన లేఖ పార్టీలో పెద్ద చిచ్చ‌కు కార‌ణ‌మైంది. లేఖ రాసి అమెరికా వెళ్లిన క‌విత వ‌చ్చే లోపు కేసిఆర్ కు రాసిన లేఖ బ‌యట ప‌డ‌డంతో….. గులాబీ పార్టీలో హాట్ హాట్ గామారింది. ఆమెరికా నుంచి వ‌చ్చి క‌విత చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత దూమారాన్ని రేపాయి. పార్టీలో కీల‌క నేత హ‌రీష్ రావ్, సంతోష్ రావ్ ల‌ను టార్గెట్ చేయ‌డంతో పార్టీ ఆమెను స‌స్పెండ్ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

క‌విత త‌న లేఖ‌కు తాను క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ పై లేఖ రాస్తే చ‌ర్య‌లు తీసుకుంటారా అంటూ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు. పార్టీ స‌స్పెండ్ చేయ‌డంతో తెలంగాణా ఉద్య‌మ స‌మ‌యం నుంచి ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన జాగృతి ఆధ్వ‌ర్యంలో వివిధ కార్య‌క్ర‌మ‌ల‌ను నిర్వ‌హిస్తూ రాజ‌కీయ పార్టీని ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేశారు. అప్ప‌టి నుంచి రాష్ట్రంలోని వివిధ వ‌ర్గాలతో స‌మావేశం అవుతూ పార్టీ విధి విధానాల‌ను ఖ‌రారు చేసేప‌నిలో ప‌డ్డారు. జాగృతికి గ‌తంలోనే రాష్ట్ర స్థాయిలో కార్య‌క‌ర్త‌లు ఉండ‌డంతో వారినంతా మ‌ళ్లీ ఏకం చేశారు. జాగృతి ఆధ్వ‌ర్యంలో పార్టీ రాబోతుంద‌ని భ‌రోసా క‌ల్పిస్తూ….. పార్టీ విధి, విధానాల‌ను ఖ‌రారు చేసేందుకు ప‌లు క‌మిటీల‌ను నియ‌మించి వివిధ‌ అంశాల‌పై నిపుణుల‌తో నివేదిక‌లు తీసుకున్నారు. ఈ ప్ర‌క్రియ పూర్తి కావ‌డంతో..తండ్రి లాగే క‌విత కూడా సెంటిమెంట్ కు అత్యంత ప్రాధ‌న్య‌త నిస్తూ…పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖారారు చేశారు.

కొత్త పార్టీపై క‌విత అభిప్రాయాలు….

ఏప్రిల్ 25 వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు పార్టీ జెండా ఆవిష్క‌ర‌ణ, పార్టీ విధి విధానాల ప్ర‌క‌ట‌న వంటి అంశాల‌పై క‌విత శ‌నివారం ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. న‌గ‌ర శివారుల్లో అలియాబాద్ లో ఉన్న అద్వ‌య కన్వెన్ష‌న్ సెంట‌ర్ లో ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్త‌య్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి జాగృతి కార్య‌క‌ర్త‌ల‌తో పార్టీ రాజ‌కీయంగా క‌విత‌తో త‌మ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దం అవుతున్న నేత‌లు హాజ‌రు కాను న్నారు. అన్ని జిల్లాల నుంచి క‌నీసం 20 వేల మందికి త‌గ్గ‌కుండా కార్య‌క‌ర్త‌లు హాజ‌ర‌వుతార‌ని జాగృతి కార్య‌క‌ర్త‌లు చెబుతున్నారు. తెలంగాణా జ‌న‌ జాగృతి పేరుతో పార్టీ పేరు ఖ‌రారు చేశార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం జాగృతి పేరుతో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుండ‌డం, జాగృతి జెండా ఇప్ప‌టికే ప్ర‌జ‌ల‌కు గుర్తుగా మార‌డంతో దానికి అద‌నంగా సామాజిక కోణంలో నీలి ( బ్లూ) రంగుకు జెండాలో చోటు క‌ల్పించిన‌ట్లు తెలుస్తోంది, జాగృతి కార్య‌క్ర‌మాల్లో ప్రొ.జ‌య శంక‌ర్ కు అత్యంత ప్రాధాన్య‌త క‌ల్పిస్తుండ‌డంతో జ‌య‌శంక‌ర్ ఆశ‌యాల‌కు అనుగుణంగా యువ‌త ను పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకోవాల‌న్నదే త‌మ ల‌క్ష్య‌మ‌ని క‌విత చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *