
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఏపీ లిక్కర్ స్కామ్ లో మరోసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైదరాబాద్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి సహా పలువురు ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో ఈ ఉదయం నుంచి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. సీఆర్ పీఎఫ్ బందోబస్తు మధ్య ఈడీ అధికారులు కీలక ఆధారాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా సమయంలో 2019-2024 మధ్య కాలంలో మద్యం విధానంలో అవకతవకలు, షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్, డబ్బు మళ్లింపు జరిగిందన్న ఆరోపణలున్నాయి. వీటితో పాటు ఇతర అనుమానాలున్న ఆర్థిక లావాదేవీలపై విజయ్ సాయి రెడ్డి ని ఆయన నివాసంలో ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఈ మాజీ ఎంపీని ఈడీ అధికారులు విచారణ జరిపుతున్నారు.





Leave a Reply