(హైదరాబాద్,న్యూస్ఇన్)
సామాజిక తెలంగాణా సాధనే తన లక్ష్యమని కల్వకుంట్ల కవిత అన్నారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో దాదాపు 45 నిమిషాల పాటు ఆమె ప్రసంగించారు. పార్టీ జెండా, ఎజెండాను అమెవెల్లడించారు. . రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు తమ పార్టీకి ఉన్న తేడాలను వివరించారు. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ఉన్నా…రాబోయే రెండేళ్ల తరువాత అధికార పార్టీగా మారుతామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణా చరిత్ర ప్రత్యేకతలను ఆమె వివరించారు. ఇదే సమయంలో బీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలను విమర్శించారు. ముఖ్యంగా బీఆర్ ఎస్ అధినేత పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ రాజకీయాల్లో హాట్ హాట్ గా మారాయి….

శనివారం ఉదయం కవిత తన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు సర్వమత ప్రార్థనలు తీసుకున్నారు. కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు తీసుకుని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి భారీ ర్యాలీతో మునిరాబాద్ చేరుకున్నారు. ఉదయం 10 గంటల కు కన్వెన్షన్ సెంటర్ కు చేరుకున్నారు.
కవిత ప్రసంగంలోని అంశాలు ….
- తెలంగాణలో ప్రస్తుతం మూడు ప్రధాన పార్టీలది తలోదారి
- బీజేపీకి తెలంగాణ ఏర్పాటుపై అసలు నిబద్ధత లేదు
- తెలంగాణ ప్రయోజనాలపై బీజేపీ ఎంపీలు మౌనంగా ఉన్నారు
- రాష్ట్రానికి నిధులు, హామీలు, హక్కులు రాకపోయినా బీజేపీ ఎంపీలు స్పందించరు
- సామాజిక న్యాయానికి బీజేపీ వ్యతిరేకం
- బీసీ బిల్లు, ఉపాధి హామీ వంటి అంశాలను కేంద్రం నిర్లక్ష్యం చేసిందని విమర్శ
భద్రాచలం-పోలవరం….

- భద్రాచలం పరిసర ఐదు గ్రామాలు ఆంధ్రాకు వెళ్లిపోయాయని ప్రస్తావన
- పోలవరం వల్ల భద్రాచలం మునిగే ప్రమాదం ఉందని హెచ్చరిక
- తెలంగాణకు చెందిన 8 మంది బీజేపీ ఎంపీలకు ఆ ఐదు గ్రామాలు తిరిగి తీసుకురావాలని సవాల్
- కాంగ్రెస్ ఎంపీలు ఆర్థిక-రాజకీయంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకురావాలి కేసీఆర్పై వ్యక్తిగత విమర్శలు….
- “ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు” అని వ్యాఖ్యలు
- ప్రజా కష్టాల్లో కేసీఆర్ ముందుకు రావడం మానేశారని విమర్శ
- రైతులు, ప్రమాదాలు, మరణాలు, స్థానిక విషాదాల సమయంలో స్పందించలేదని ఆరోపణ
- అధికారం వచ్చిన తర్వాత మమకారం, మమత, కార్యకర్తల పట్ల అనుబంధం పోయింది
పార్టీ కార్యకర్తల నిర్లక్ష్యం—

- తెలంగాణ ఉద్యమం కోసం భూములు అమ్ముకొని జెండాలు వేసిన కార్యకర్తలకు అన్యాయం
- ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నవారికి పదవులు, ఎమ్మెల్యే అవకాశాలు ఇచ్చారని ఆరోపణ
- ప్రతి సంవత్సరం 6000 పైచిలుకు నామినేటెడ్ పోస్టులు వస్తాయని చెప్పారు
-పదేళ్లలో -రెండేళ్లలో 30,000 మందికి గౌరవప్రదమైన గుర్తింపు ఇవ్వవచ్చని వ్యాఖ్య - ఉద్యమ కార్యకర్తలకు కనీస మర్యాద కూడా రాలేదని అసంతృప్తి
కాళేశ్వరం- పాలమూరు పై విమర్శలు…..
- నీళ్లు, నిధులు, నియామకాలు అనే తెలంగాణ ప్రధాన లక్ష్యాల గుర్తు
- బీఆర్ఎస్ 9 ఏళ్లలో నీటి కోసం ₹1,89,000 కోట్లు ఖర్చు పెట్టింది
- 14 లక్షల ఎకరాలు తడిసేలా చేశామని చెప్పినా, పెద్ద ప్రాజెక్టులు ఆశించిన ఫలితం ఇవ్వలేదని విమర్శ
- కాలేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై అవినీతి ఆరోపణలు
- కాలేశ్వరం అవినీతి గురించి మాట్లాడిన వారిని పక్కన పెట్టి, అవినీతి చేసిన వారిని కాపాడుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడి వైఫల్యాలు——
- ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని “రాక్షస కాంగ్రెస్”గా వర్ణణ ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేస్తా
- అనుమతులు ఉన్నా రాత్రివేళ కూల్చివేతల వల్ల గర్భిణి మరణించిన ఘటన కలిచి వేసింది
- చిన్న పసికందు మరణించినా కేసు నమోదు కాలేదని ఆరోపణ
- గురుకులాల్లో విషప్రయోగం చేసి పిల్లలు చనిపోతున్నారనే తీవ్ర ఆరోపణ
- కస్టడీలో మరణాలపై బాధ్యులైన పోలీసులపై చర్యలు లేవని విమర్శ
- రెండేళ్లలో తామే ప్రధాన ప్రతిపక్షం, తర్వాత అధికార పక్షం అవుతామని ధీమా
కవిత “పాంచజన్యం” అజెండా

- మూడు పార్టీలూ అవినీతి, బంధుప్రీతి, కుటుంబ పరిపాలనతో నిండిపోయాయి
- దీనికి ప్రత్యామ్నాయంగా “పాంచజన్యం” అనే శంఖనాదంతో ఐదు అంశాలపై పోరాటం చేస్తామని ప్రకటన
- ఇప్పుడే వాటి కోసం పోరాడి, రేపు అధికారంలోకి వచ్చాక ప్రజలకు అందిస్తామని చెప్పారు
ఉచిత విద్య హామీ…
- పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివినా ఒక్క రూపాయి భారం పడనివ్వను
- డాక్టర్, ఇంజనీర్, రాకెట్ సైంటిస్ట్ స్థాయి వరకు చదివినా ఉచిత విద్య ఉచితం అని హామీ
- యూనివర్సిటీ విద్యార్థులకూ ఆర్థిక భారం లేకుండా చదివించే బాధ్యత నాది
- విద్య ఖర్చు ఎంతైనా రాష్ట్రం భరిస్తుందని ప్రకటించారు
- రెండో అజెండా: ఉచిత వైద్యం
- ఇంట్లో రోగం లేదా యాక్సిడెంట్ వస్తే కుటుంబం ఆర్థికంగా కూలిపోతుంది
- అందుకే వైద్యాన్ని రెండో ప్రధాన అంశంగా తీసుకున్నాము
- ఏ రోగమైనా, ఎంత పెద్ద హాస్పిటల్ అయినా ఉచిత చికిత్స
- వైద్య సేవలు ప్రజలకు అడ్డంకులు లేకుండా చేరేలా చేయాలనే సంకేతం ఇచ్చారు

మూడో అజెండా: రైతుకు గౌరవం—–
- రైతు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే అవమానకర అనుభవం ఎదురవుతోంది
- పరిచయాలు, ప్రభావం లేకపోతే పని జరగదని ఆరోపణ
- తమ ప్రభుత్వం వస్తే రైతుకు ప్రత్యేక గౌరవం కల్పిస్తామని హామీ
రైతు సేవా హామీలు…..
- ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రైతులకు ప్రత్యేక కౌంటర్
- రైతును కూర్చోబెట్టి పని చేసి పంపించే విధానం
- “నేను రైతునని ధైర్యంగా చెప్పుకునే” పరిపాలన
- 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు
- కొనుగోలు కేంద్రాలు రైతు దగ్గరికి వచ్చేలా వ్యవస్థ
- రైతులకు ప్రకటించిన హామీలను నిజం చేస్తామని భరోసా నాలుగో అజెండా యువత కోసం….
- యువకులు ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, కళారంగానికి వెళ్లాలా అన్న నిర్ణయం వాళ్లే తీసుకోవాలి
- ప్రభుత్వాలు యువతను “ఉద్యోగ బానిసత్వం” వైపు నెడుతున్నాయి
వ్యాపార రుణాల హామీ…..
- 2 లక్షల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల వరకు రుణాలు
- బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా రుణాలు ఇవ్వడం
- యువత ఐడియాలపై ఆధారపడి ఫైనాన్స్ చేయడం
- “యూత్ ఎంపవర్మెంట్ గ్రూప్స్” ఏర్పాటు
ఉద్యోగాల హామీ—

- ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో 4 లక్షల ఉద్యోగాలు
- ఒక్కసారిగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం
- జూన్ 2, 2014 వరకు కట్-ఆఫ్ డేట్ పెట్టి ఉద్యమ కోటాలో ఉద్యోగం
- అదనంగా 1 లక్ష “సూపర్ న్యూమరరీ జాబ్స్” సృష్టిస్తామని ప్రకటన
ఐదో అజెండా: సామాజిక న్యాయ కేంద్రంగా కొత్త తెలంగాణ
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు అందరికీ న్యాయం జరగాలి
- ముస్లింలకు హామీ ఇచ్చిన 12% రిజర్వేషన్ అమలు కాలేదని విమర్శ
- మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి వాగ్దానాలు ఫలించలేదు
- ఎమ్మెల్యేలు, ఎంపీలలో 50% రిజర్వేషన్ వచ్చేంత వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు
దళిత-ఆదివాసి హామీలు——
- దళిత బంధు నిజాయితీగా అమలు కాలేదని విమర్శ
- దళితులకు మరింత ప్రాధాన్యం ఇస్తామని హామీ
- ప్రస్తుత రాజ్యాంగ అవకాశాలకన్నా మెరుగైన అవకాశాలు కల్పిస్తాం
- ఆదివాసీలకు ప్రత్యేక కార్పొరేషన్లు
- ప్రతి ఆదివాసీ బిడ్డకు ఫైనాన్షియల్ సపోర్ట్
- గౌరవ మర్యాదలు, ప్రత్యేక గుర్తింపు
అమరవీరుల కుటుంబానికి ₹1 కోటి

- కోయ భాషను రాజ్యంగ పరంగా గుర్తింపు పొందిన భాషగా చేర్చేందుకు ప్రయత్నం చేస్తా మహిళలు, అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేక హామీలు…
- తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేక గౌరవం ఇస్తామని చెప్పారు
- ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి అమరవీరుల కుటుంబానికి ₹1 కోటి ఇస్తామని ప్రకటన
- ఆడబిడ్డల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తాం
- మహిళలు ఏ వయసులోనైనా భయపడకుండా ఉండే తెలంగాణ నిర్మిస్తామని హామీ
- సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు సరైన గ్రాంట్లు అందించేలా చూస్తాం
- చిరు ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, విస్మరించబడిన వర్గాలను కాపాడుతాం
మూడు పార్టీలకు వ్యతిరేకంగా యుద్ధం….
- కాంగ్రెస్ లక్ష్యం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమే
- బీఆర్ఎస్ లక్ష్యం కుటుంబాధిపత్యం కొనసాగడమే
- బీజేపీ లక్ష్యం కూడా ప్రజా ప్రయోజనం కాదు
- మూడు పార్టీల మీదా ఒకేసారి పోరాడేందుకు సిద్ధం కావాలని పిలుపు
- త్వరలో వచ్చే జడ్పీటీసీ, గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటన










Leave a Reply