NewsInn

News in a Click

స్వీయ జ‌న‌గ‌ణ‌న – ప్రారంభించిన గ‌వ‌ర్న‌ర్

స్వీయ జ‌న‌గ‌ణ‌న – ప్రారంభించిన గ‌వ‌ర్న‌ర్

(హైదరాబాద్, న్యూస్ఇన్‌)

స్వీయ జ‌న‌గ‌ణ‌ణ న‌మోదు ప్ర‌క్రియ‌ను గ‌వ‌ర్న‌ర్ శివ‌ప్ర‌తాప్ శుక్లా ఆదివారం రాష్ట్రంలో ప్రారంభించారు.
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆన్‌లైన్ లో తన వివరాలను నమోదు చేసుకున్నారు. జ‌న‌గ‌ణ‌న డైరెక్ట‌ర్ భార‌తి హోళికేరి, హైద‌రాబాద్ క‌మిష‌న‌ర్ ఆర్ వీ క‌ణ్ణ‌న్ లోక్ భ‌వ‌న్లో ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్నతో క‌లిసి వివ‌రాల‌ను న‌మోదు చేయ‌డంలో స‌హ‌క‌రించారు. దీంతో రాష్ట్రంలో స్వీయ జ‌న‌గ‌ణ‌న మొద‌లైన‌ట్లు డైరెక్ట‌ర్ భార‌తి హోళికేరి ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ శివ‌ప్ర‌తాప్ శుక్లా మాట్లాడుతూ…
జనాభా గణన అనేది ఒక కీలకమైన జాతీయ కార్యక్రమం. ఇది మన జనాభా , వారి సామాజిక-ఆర్థిక స్థితిపై సమగ్రమైన చిత్రాన్ని అందిస్తుంది. ఇది ప్రణాళిక, సుపరిపాలన, వనరుల సమాన పంపిణీకి పునాది. తద్వారా అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా ఇది నిర్ధారిస్తుందన్నారు.

విద్య, ఆరోగ్యం, ఉపాధి, గృహనిర్మాణం, మరియు మౌలిక సదుపాయాలకు సంబంధించిన విధానాలను రూపొందించడంలో జనాభా గణన పోషించే కీలక పాత్రలో దాని ప్రాముఖ్యత ఉంది. కచ్చితమైన సమాచారం, సంక్షేమ పథకాలను రూపొందించడానికి , జాతీయ పురోగతిని సమర్థవంతంగా అంచనా వేయడానికి ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇదే మొదటి జనాభా గణన కావడం వల్ల ఇది ప్రత్యేకంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి , పురోగతికి కచ్చితమైన సమాచార సేకరణ చాలా కీలకమ‌న్నారు.

తెలంగాణాలో తొలిసారి…..

తెలంగాణా రాష్ట్ర ఆవిర్బావం త‌రువాత తొలిసారి జ‌న‌గ‌ణ‌న జ‌రుగుతోంది. డిజిటల్ రూపంలో జ‌రుగుతున్న జ‌న‌గ‌ణ‌ణ కావ‌డం కూడా తొలిసారి. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో జ‌న‌గ‌ణ‌ణ‌తో పాటు కుల గ‌ణ‌న ప్ర‌క్రియ కూడా ఈ విడత చేస్తున్న జ‌న‌గ‌ణ‌న‌లో చేయాల‌ని కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌తి ప‌దేళ్ల‌కు ఒక సారి నిర్వ‌హించే జ‌న‌గ‌ణ‌న ద్వారానే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌థ‌కాల అమ‌లుకు చ‌ర్య‌లు తీసుకుంటాయి. కోవిడ్ కార‌ణంగా 2021 లో జ‌న‌గ‌ణ‌న నిర్వ‌హించ‌లేదు. దీంతో ఆరేళ్ల త‌రువాత ప్ర‌స్తుతం జ‌న‌గ‌ణ‌న ను ప్ర‌భుత్వం చేప‌ట్టింది. 2027 కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌థ‌కాల రూప‌క‌ల్ప‌న‌, అమ‌లు విష‌యంలో అనుస‌రించాల్సిన విధానాల‌ను ఖ‌రారు చేస్తాయి. దీంతో జ‌న‌గ‌ణ‌ను అత్యంత ప్రాధాన్య‌త అంశంగా కేంద్రం భావిస్తుంది.జ‌న‌గ‌ణన‌లో అంతా పాల్గొనాలని జ‌న‌గ‌ణ‌న డైరెక్ట‌ర్ భార‌తి హోళికేరి విజ్ఙ‌ప్తి చేశారు. జ‌న‌గ‌ణ‌లో ఇచ్చే స‌మాచారం పూర్తిగా గోప్యత ఉంటుంద‌ని ఎవ‌రికి ఎలాంటి అనుమానాలు అవ‌స‌రం లేద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *