(హైదరాబాద్,న్యూస్ఇన్)
బిగ్ బాస్ ఫేం, టీవీ సీరియల్ నటి అషురెడ్డిపై కేసు నమోదైంది. ఆషురెడ్డి తమను మోసం చేసిందని పోలీసులకు ఓ కుటుంబం ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.హైదరాబాద్ – షేక్పేట్ ప్రాంతానికి చెందిన యెనుముల సత్యనారాయణ కుమారుడు వై.వి. ధర్మేంద్ర లండన్లో సాప్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తుండగా, 2018లో ఇండియాకు వచ్చిన సమయంలో అషురెడ్డి ధర్మేంద్రతో పరిచయం పెంచుకుంది.

ఆ తరువాత కొన్ని రోజులకే ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని మరింత దగ్గరైంది. ధర్మేంద్రతో పెళ్లి సంబంధాన్ని ఖాయం చేస్తున్నామంటూ పురోహితుడిని పిలిపించి అషురెడ్డి కుటుంబసభ్యులు హడావుడి చేశారు. అప్పటి నుంచి అషురెడ్డి కుటుంబ సభ్యులు ధర్మంద్ర కుటుంబం నుంచి దాదాపు 9.35 కోట్ల రుపాయలతో పాటు 5 కిలోల బంగారం, ఖరీదైన ఫ్లాట్లు, వాహనాల కొనుగోలు చేసిందని ధర్మేంద్ర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అషురెడ్డి సోదరి కూడా 50 లక్షలు తీసుకుందన్నారు. తన కుమారుడి పెళ్లి విషయం అషురెడ్డి కుటుంబ సభ్యులతో ప్రస్తావిస్తే దాట వేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాగా డబ్బలు తీసుకున్న తరువాత అషురెడ్డి కూడా మోహం చాటేసి పెళ్లి అంటే నిరాకరిస్తోందని ఆరోపించారు. దీంతో పోలీసులు అషురెడ్డి సహా ఆమె కుటుంబ సభ్యులపై పలు సెక్షన్ల కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.









Leave a Reply