NewsInn

News in a Click

మ‌ధ్యాహ్నం వ‌ర‌కు వ‌డ‌గాలులు- సాయంత్రం వ‌ర్షాలు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణా వ్యాప్తంగా ఈ రోజు మ‌ధ్యాహ్నం వ‌ర‌కు తీవ్ర‌మైన ప్రభావంతో వ‌డ‌గాలులు వీచే అవ‌కాశం ఉంది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల త‌రువాత వాత‌వర‌ణంలో ఉక్క‌పోత తీవ్ర‌త అలాగే ఉన్నా…. సాయంత్రం నుంచి రాత్రి వ‌ర‌కు ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అప్ర‌మ‌త్తం చేస్తోంది. రంగారెడ్డి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, నల్గొండ, యాదాద్రి – భోంగీర్, సంగారెడ్డి జిల్లాల్లో చెదురుమదురుగా తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచ‌నా. హైదరాబాద్ లో సాయంత్రం వేళల్లో చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెద‌ర్ మెన్ ప్ర‌క‌టించారు. గ‌త కొన్ని రోజులుగా ఎండ తీవ్ర‌త త‌క్కువ‌గా అనిపిస్తున్నా…ఉక్క పోత‌తో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు.ఈ ప‌రిస్థితుల్లో ఈ రోజు కూడా వాతావ‌ర‌ణంలో పెద్ద‌గా మార్పులు లేక‌పోచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *