(న్యూఢిల్లీ,న్యూస్ఇన్)
రాజ్యసభలో సంఖ్యాబలం పెంచుకునేందుకు బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతంగా ముగిసింది. రాజ్యసభలో బీజేపీ కి ఎదరౌతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆప్ రాజ్యసభ సభ్యులను టార్గెట్ చేసింది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ ఆపరేషన్ రే బీజేపీ పులిస్టాప్ పెట్టింది. ఆప్ కు చెందిన 7 గురు ఎంపీలన బీజేపీలో చేర్చుకుంది. పార్టీ ఫిరాయించిన రాజ్యసభ సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆప్ అదిష్టానం కోరింది. ఇదే సమయంలో పార్టీ ఫిరాయించిన ఎంపీలు ఆప్ రాజ్యసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలని కోరారు. దీంతో ఆప్ ఎంపీల విజ్ఙప్తితోనే రాజ్యసభ చైర్మన్ రాధకృష్ణన్ ఏకీభవించారు. ఆప్ ఎంపీలను బీజేపీ రాజ్యసభ పక్షంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బీజేపీ సంఖ్యా బలం 106 నుంచి 113కు పెరిగింది.

రాఘవ్ చద్దా, హర్బజన్ సింగ్, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్,స్వాతి మాలివాల్, రాజేందర్ గుప్తా, విక్రం జిత్ సింగ్ లు చేరారు. దీంతో బీజేపీ రాజకీయంగా ఆప్ ను కోలుకోలేని విధంగా దెబ్బకొట్టింది. 10 మంది రాజ్యసభ సభ్యుల్లో 7 గురు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆప్ లో కేవలం 3 ఎంపీలు మాత్రమే మిగిలారు. ఈ రాజకీయ పరిణామాలు భవిష్యత్తు రాజకీయాలపై కూడా ప్రభావితం చూపే అవకాశం ఉంటుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రాంతీయ పార్టీని టార్గెట్ చేస్తూ బీజేపీ పావులు కదుపుతండడం మరోసారి చర్చనీయంశంగా మారింది. ఢిల్లీ, పంజాబ్ లలో అధికారం దక్కించుకుని బీజేపీని అధికారానికి దూరం చేసిన పార్టీ ప్రతిపక్షంగా మారడంతో బీజేపీ సరైన సమయం కోసం ఎదురు చూసింది. అంతర్గత సమస్యలతో కొట్టు మిట్టాడుతున్న ఆప్ ను కోలుకోలేని దెబ్బ ఇప్పుడు కమలనాథులు కొట్టారు. ఆప్ ను ఈ దెబ్బతో ఊడ్చేసినంత పని బీజేపీ చేసింది.












Leave a Reply