(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
ఐపీఎల్ ఆర్సీబీ బౌలర్లు ఢిల్లీ బ్యాటర్లను వణికించారు. మూడు ఓవర్లలోనే ఐదు వికెట్లు పడగొట్టారు. ఇన్నింగ్స్ రెండో బంతికి భువి బౌలింగ్ లో ఓపెనర్ ఓపెనర్ సాహిల్ వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్ లో వికెట్ కోల్పోవడంతో మిగిలిన నాలుగు బంతులను ఢిల్లీ బ్యాటర్లు ఆచితూచి ఆడారు. రెండో ఓవర్ వేసి హేజిల్ ఉడ్ తొలి బంతికే ఢిల్లీ కీలక బ్యాట్స్ మెన్ కే.ఎల్. రాహూల్ వికెట్ తీసుకున్నారు. ఆ తరువాతి బాల్ కు సమీర్ రిజ్వీ కౌడా ఔటయ్యారు. దీంతో రెండు పరుగులకు మూడు వికెట్లు ఢిల్లీ కోల్పోయింది. హెజిల్ ఉడ్ హ్యాట్రిక్ అవకాశం వచ్చినా స్టబ్స్ బ్యాటింగ్ వచ్చి అడ్డుకున్నారు.స్టబ్స్ తాను ఎదుర్కొన్న మొదటి బంతిని బౌండరీకి తరలించడంతో ఢిల్లీ జట్టు స్కోరు 7 పరుగులకు చేరుకుంది. ఆ తరువతి ఓవర్ లో స్టబ్స్ భువనేశ్వర్ చేతికి చిక్కారు. దీంతో 7 పరుగుల వద్ద ఢిల్లీ 4వ వికెట్ కోల్పోయింది. అదే ఓవర్లో అక్షర్ పటేలో కూడా ఔటవ్వడంతో ఢిల్లీ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్ పూర్తిగా పెవీలియన్ చేరుకున్నట్లయింది. 4వ ఓవర్లోనే నితీష్ రాణా కూడా జట్టు స్కోరు 8 పరుగులున్న సమయంలో వెనుదిరిగారు. దీంతో ఢిల్లీ బ్యాటర్లకు ఇలా వచ్చి అలా వెళుతున్నట్లు కనిపించింది. ఢిల్లీ బ్యాటర్లు ఆర్సీబీ సీమర్లను ఎదుర్కొనేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తొలి ఐదు ఓవర్లలోనే ఢిల్లీ సగం జట్టు పెవిలీయన్ చేరుకోవడంతో ఆర్సీబి బౌలర్ల హవా ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ పరిస్తితి చూస్తుంటే పది ఓవర్ల వరకైనా ఢిల్లీ జట్టు బ్యాటర్లు అడగలారా అన్న అనుమానాలు వచ్చాయి.


ఢిల్లీ హౌం గ్రౌండ్ లో మ్యాచ్ జరుగుతుండడంతో ఢిల్లీ అభిమానులు తీవ్ర నిరాషకు గురయ్యారు. అదే సమయంలో ఆర్సీ అభిమానుల్లో బౌలర్లు జోష్ నింపారు.డేవిడ్ మిల్లర్, పోరెల్ కొద్ది సేపు నిలదొక్కుకోవడంతో జట్టు స్కోరు మెల్లగా పెరిగింది.9 ఓవర్లలో 43 పరుగులకు చేరుకుంది. అదే సమయంలో మిల్లర్ ఔట్ కావడంతో 7వ వికెట్ కూడా ఢిల్లీ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ 3 ఓవర్లలో 5 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోగా హేజిల్ ఉడ్ 3.3 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నారు.సలాం ఒక వికెట్ తీసుకున్నారు. ఢిల్లీ వీచిన భారీ ఈదురు గాలలుతో కొద్ది సేపు ఆటకు అంతరాయం కలిగింది. కృనాల్ పాండ్య బౌలింగ్ లో 62 పరుగుల వద్ద జెమిసన్ 8వ వికెట్ రూపంలో వెనుదిరిగారు. కుల్దీప్ యాదవ్ 2 పరుగులు చేసి సుయాష్ శర్మ బౌలింగ్ లో 71 పరుగుల వద్ద 16వ ఓవర్లో ఔటయ్యారు. పోరెల్ ఒంటరి పోరాటం సాగిస్తున్నా ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందలేకపోయింది.ఆచి తూచి ఆడుతూ పోరెల్ క్రీజులో నిలదొక్కుకున్నారు. చివరి వరకు బ్యాటింగ్ చేసిన పోరెల్ చేసిన స్కోరే అత్యధికం 30 పరుగులు చేసిన 75 పరుగుల వద్ద పోరెల్ ఔట్ కావడంతో ఢిల్లీ 16.4 ఓవర్లలో 75 పరుగులకు అలౌట్ అయింది. ఢిల్లీ ఇన్నింగ్స్ లో కేవలం 8 ఫోర్లు , ఒక సిక్స్ మాత్రమే ఉంది.ఈ మ్యాచ్ లో ఆర్సీబీ టార్గెట్ 76 పరుగులు మాత్రమే.












Leave a Reply