(హైదరాబాద్,న్యూస్ఇన్)
వాతావరణంలో వచ్చిన మార్పులతో గాలి- వాన దూమారం రేపింది. ఒక్క సారి ఉధృతి పెరగడం రంగారెడ్డి జిల్లా లో విషాయదం నింపింది. ఎన్ సీసీ కంపెనీలో క్రేన్ కూలిపోవడంతో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. కన్సస్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్న మరికొంత మంది కూడా ఆ భారీ క్రేన్ కింద చిక్కుకున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన ఘటనపై కంపెనీ ముందుగా కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది.

భారీ ప్రమాదం కావడంతో సహాయక చర్యలు చేపట్టక తప్పలేదు. భారీ ప్రమాదం కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. గాయపడ్డ వారిని హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు చత్తీస్ ఘడ్, ఒడిష్షా రాష్ట్రాలకు చెందిన కార్మికులుగా గుర్తించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద ఘటనను తెలుసుకున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య సంఘటనా స్థానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.











Leave a Reply