NewsInn

News in a Click

పెట్రోల్,డీజిల్ కొర‌త లేదు – ప్ర‌భుత్వం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్రoలో పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా సమృద్ధిగా ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం 27 వ తేదీన డిమాండ్ ను మించి పెట్రోల్ , డీజిల్ లను 29,939 కిలో లీటర్లు సరఫరా చేసినట్లు వివరించారు. సగటున రోజుకు 5,883 కిలో లీటర్లు పెట్రోల్, 7,348 కిలో లీటర్లు డీజిల్ కు డిమాండ్ ఉండేదని ఆయన తెలిపారు. కానీ 27 వ తేదీన 11,490 కిలో లీటర్లు పెట్రోల్, 18,449 కిలో లీటర్లు డీజిల్ ను వాహనదారులకు సరఫరా చేసినట్లు తెలిపారు. సరఫరాను క్షేత్ర స్థాయి అధికారులు, పెట్రోల్ కంపెనీల ప్రతినిధులతో రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అపోహలతో పెట్రోల్, డీజిల్ ను నిల్వచేసుకోవద్దని వినియోగదారులకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సూచించారు.

ఏపీ నుంచి తెలంగాణా కు పాకిన కొర‌త‌…..

అధికారులు పెట్రో ఉత్ప‌త్తుల‌పై అధికారులు ఇలాంటి ప్ర‌క‌ట‌న చేస్తున్నా….పెట్రల్ బంక్ లు మూత బ‌డుతుండ‌డం వెనుక ర‌హ‌స్యం ఏమిట‌న్న‌ది అధికారుల‌కే తెలియాలి. పెట్రోల్ బంకుల మూసి వేత‌తోనే ప్ర‌జ‌ల్లో అనుమానాలు ఎక్కువ అవుతూ పెట్రో ఉత్ప‌త్తుల కొర‌త ఉంద‌న్న దానికి బ‌లం చేకూర్చిన‌ట్లు అవుతోంది.హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు జిల్లాల్లో కూడా కొన్ని బంక్ లు మూత ప‌డుతున్నాయి. దీంతో ప్ర‌జ‌ల్లో ఆందోల‌న పెరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *