NewsInn

News in a Click

అధికారు ల నిర్లక్ష్యం- బాలిక మృతి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

మిష‌న్ భ‌గీర‌థ అధికారుల నిర్ల‌క్ష్యం ఒక చిన్నారి ప్రాణం తీసుకుంది. మ‌ర‌మ్మ‌త్తుల కోసం దాదాపు 4 మీట‌ర్ల గోతిని త‌వ్వి దాదాపు 20 రోజులుగా మ‌ర‌మ్మ‌త్తులు పూర్తి చేయ‌కుండా గోతిని అలాగే వ‌దిలేశారు. దీంతో మిష‌న్ భ‌గీర‌థ పైప్్ లైన్ల‌లోని ఆ గోతిలోకి చేరింది. ప్ర‌మాద వ‌శాత్తు ఆ నీటి గుంట‌లో ప‌డి ఓ ఐదేళ్ల బాలిక మృతి చెందింది.జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలీంపూర్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.ప్రాథమికోన్నత పాఠశాలలోని అంగన్ వాడి ఆయాగా పనిచేస్తున్న కవిత అనే మహిళ కూతురు మోక్షిత(5) ఆ నీటి గోతిలో ప‌డ‌డంతో ఆ బాలిక అక్క దీక్షిత గ‌మ‌నించి వెంట‌నేత‌ల్లికి స‌మాచారం ఇచ్చింది. మోక్షిత‌ను గోతిలోంచి తల్లి బ‌య‌ట‌కు తీయ‌డంతో ఆ చిన్నారి అప్ప‌టికే మృతి చెందింది. అధికారుల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతోనే చిన్నారి ప్రాణం కోల్పోయిందని గ్రామస్తులు ఆందోళ‌న చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *