NewsInn

News in a Click

సనత్‌నగర్‌‌ టిమ్స్‌లో ట్రయల్ రన్

సనత్‌నగర్‌‌ టిమ్స్‌లో ట్రయల్ రన్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు.. శుక్రవారం నుంచి హాస్పిటల్‌లో నెల రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం నుంచి సుమారు నెల రోజుల పాటు ట్రయల్ రన్ కొనసాగనుంది. ట్రయల్‌ రన్‌లో భాగంగా రోజూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అవుట్‌ పేషెంట్‌, డయాగ్నసిస్ సేవలు అందించనున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీతో పాటు మొత్తం 22 విభాగాల్లో ట్రయల్ రన్ జరగనుంది.

ఇందుకోసం అవసరమైన డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బందిని అధికారులు నియమించారు. అత్యాధునికంగా నిర్మాణం చేసిన ఈ ఆసుప‌త్రి అందుబాటులోకి వ‌స్తే గాంధీ, ఉస్మానియా ఆసుప‌త్రుల‌తో పాటు నిమ్స్ పై కూడా వ‌త్తిడి త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. వివిధ విభాగాల‌కు ప్ర‌త్యేక వైద్యుల‌ను కేటాయించ‌డంతో పాటు సిబ్బందిని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే నియ‌మించింది. న‌గ‌రంలోని కీల‌క ఆసుప‌త్ర‌ల్లో భారీగా రోగులు పెర‌గ‌డంతో వారిని న‌గ‌రంలోని నాలుగు వైపుల అత్యాధినిక వైద్య శాల‌ల‌ను అంద‌బాటులోకి తేవాల‌ని గ‌త ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

ప‌నుల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న మొద‌లు పెట్టింది. అత్య‌స‌రంగా ప‌నుల‌ను పూర్తి చేయాల‌న్న ఆదేశాల‌తో స‌న‌త్ న‌గ‌ర్ టిమ్స్ నిర్మాణం పూర్తి కావ‌డం, వైద్యం కోసం ఏర్పాట్లు కూడా అక్క‌డ ఏర్పాటు చేయ‌డంతో నెల రోజుల ట్ర‌య‌ల్ ర‌న్ అనంత‌రం ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ఆ త‌రువాత పూర్తి స్థాయిలో వైద్యం అందించేందుకు ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *