(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సన్ రైజర్స్ అభిమానులను నిరాష పరిచింది. అభిషేక్, హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్ ఇన్నింగ్స్ లతో ఎంజయ్ చేయవచ్చని భావించిన హైదరాబాద్ అభిమానులకు హౌంగ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ నిరాష పరిచింది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆశలు సజీవంగా ఉండే కేకేఆర్ జట్టు ఎస్ ఆర్ హెచ్ పై విజయం సాధించి ముందు మ్యాచ్ లను ఎదుర్కొనేందుకు బరిలో నిలిచింది. సన్ రైజర్స్ పై కేకేఆర్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు నామమాత్రపు లక్ష్యాన్ని మాత్రమే కేకేఆర్ ముందు ఉంచింది. 10 ఓవర్ల వరకు ధాటిగా ఆడిన ఎస్ ఆర్ జట్టు ఆ తరువాత చతికిల బడింది. 55 పరుగులు చేసే లోపే జట్టు 19 ఓవర్లలో అలౌట్ అయింది. 156 పరుగుల లక్ష్యంగా బరిలో దిగిన కేకేఆర్ ఎస్ ఆర్ హెచ్ పై తొలి ఓవర్ నుంచే ఆధిపత్యం చలాయించింది.

సన్ రైజర్స్ ఓపెనర్ల మాదిరిగానే కేకేఆర్ కూడా ఇన్నింగ్స్ ధాటిగా మొదలు పెట్టింది. అజింక్యా రహనే ఆచి తూచి ఆడితే మరో బ్యాట్స్ మెన్ ఫిన్ అలెన్ కొద్దిసేపే భారీ షాట్లు ఆడి జట్టు స్కోరు వేగం పెంచారు. 13 బంతులు మాత్రమే ఎదుర్కొని 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 29 పరుగులు చేసి జట్టు స్కోరు 4 ఓవర్లో 49 పరుగుల వద్ద వెనుదిరిగారు. ఆ తరువాత రహానే – రఘువంశీ లు ఎస్ ఆర్ హెచ్ బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా ఆచితూచి ఆడుతూనే ….స్కోరును ముందుకు తీసుకెళ్లారు. రహనే బాధ్యతా యుతంగా బ్యాటింగ్ చేయకగా రఘువంశీ ఈ మ్యాచ్ లో కూడ దూకుడుగా ఆడి 39 బాల్స్ లో 50 పరుగులు చేశారు.రహానే 15వ ఓవర్లో 133 పరుగుల వద్ద 34 బంతుల్లో 43 పరుగులు చేసి ఔటయ్యారు. క్రీజులో ఉన్న రఘువంశీకి రింకూ సింగ్ జతకట్టారు.రఘువంశీ 47 బంతుల్లో 59 పరుగులు చేసి 3వ వికెట్ రూపంలో 17వ ఓవర్లో ఔటయ్యారు. కానీ అప్పటికే విజయం కోసం అతి చేరువలోకి కేకేఆర్ జట్టు వచ్చింది. రింకూసింగ్, గ్రీన్ లు విజయ తీరాలకు జట్టును చేర్చారు. రింకూ సింగ్ 22పరుగులతో, గ్రీన్ 3 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.








Leave a Reply