NewsInn

News in a Click

మ‌హాన‌గ‌రంలో పట్టుబడ్డ గ్యాస్ దొంగలు…….!

మ‌హాన‌గ‌రంలో పట్టుబడ్డ గ్యాస్ దొంగలు…….!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ఇరాన్- ఆమెరికా యుద్ధ ప్ర‌భావం సామాన్య ప్ర‌జ‌ల ఇంటికి, చిన్న హోట‌ళ్ల నుంచి పెద్ద హోట‌ళ్ల వ‌ర‌కు తాకింది. ఇదే అద‌న‌గా అవ‌కాశంగా అక్ర‌మార్కులు త‌మ సాంకేతిక‌త‌కు ప‌దును పెడుతున్నారు. గృహ అవ‌స‌రాల‌కు వినియోగించే సిలిండ‌ర్లు, వాణిజ్య అవ‌స‌రాల‌కు వినియోగించే సిలిండ‌ర్ల బ్లాక్ మార్కెట్ కూడా పెరిగింది. వాణిజ్య సిలిండ‌ర్ ధ‌ర దాదాపు 3 వేల రుపాయ‌లు అధికారికంగా ఉండ‌గా..అత్య‌వ‌స‌రంగా బ్లాక్ లో కొనుగోలు చేయాలంటే ఒక్కో సారి 5 వేల రుపాయాల‌కు పైగా ధ‌ర ప‌లుకుతుంది. గృహ వినియోగదారులు కూడా అందుబాటులో మ‌రో సిలిండ‌ర్ ఉన్న‌ట్లు అయితే ఆ సిలిండ‌ర్ల‌ను కూడా బ్లాక్ మార్కెట్ కు త‌ర‌లిస్తున్నారు. ఈ సిలిండ‌ర్ కూడా రెట్టింపు కంటే ఎక్కువ మ‌ర్కెట్లో ధ‌ర ప‌లుకుతోంది. గ్యాస్ ఏజ‌న్సీల ప్ర‌మేయం నేరుగా లేకుండా కింది స్థాయి సిబ్బందితో క‌లిసి మాయాజాలం చేస్తున్నారు. వ్యాపార అవ‌స‌రాల కోసం వినియోగించే వాణిజ్య సిలిండ‌ర్లు దొర‌క‌డ‌మే గ‌గ‌నం అన్న చందంగా ప‌రిస్థితి మారి పోవ‌డంతో…కొంత మంది అక్ర‌మార్కులు వాణిజ్య గ్యాస్ సిలిండ‌ర్ల‌ను కొనుగోలు చేస్తూ దాంట్లో గ్యాస్ ను ఇత‌ర సిలిండ‌ర్ల‌లోకి రీఫిల్లింగ్ చేస్తున్నారు.

వాణిజ్య గ్యాస్ సిలిండ‌ర్ల‌ను టార్గెట్ చేస్తూ ఆ సిలిండ‌ర్ల నుంచి గ్యాస్ ను దొంగిలిస్తున్నారు. దొంగిలించిన గ్యాస్ ను చిన్న సిలిండ‌ర్ల‌లో నింపుతూ రెండు వైపుల ల‌బ్ది పొందుతున్నారు. వాణిజ్య సిలిండ‌ర్ అధికారికంగా బుక్ చేసిన వారికి త‌క్కువ తూకంతే సిలిండ‌ర్లు అందుతున్నాయి. ఇక చిన్న సిలిండ‌ర్ల‌లో రీఫిల్ చేసి దాన్ని కూడా బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. దీంతో వాణిజ్య అవ‌స‌రాల‌కు వినియోగించే సిలిండ‌ర్ ఉండాల్సిన బ‌రువు కంటే త‌క్కువ బ‌రువుకు అవుతున్నాయి. గ్యాస్ ఏజ‌న్సీలు కూడా ఈ వ్య‌వ‌హారాన్ని గుట్టు చ‌ప్పుడు కాకుండా సాగిస్తున్నాయి. తక్కువ బ‌రువు ఉండే సిలిండ‌ర్ల నుంచి కాకుండా 30 కిలోల బరువుండే సిలిండ‌ర్ల నుంచి గ్యాస్ ను ఇత‌ర సిలిండ‌ర్ల‌లోకి మారుస్తున్నారు. దీని తూకంటే కూడా అనుమానం రాకుండా ఒక‌టిన్న‌ర నుంచి రెండున్న‌ర‌ కిలోలు దొంగిలిస్తూ….సిలిండ‌ర్ల‌ను విక్ర‌యిస్తున్నారు. ఇలా అక్ర‌మంగా గ్యాస్ సిలిండ‌ర్ల‌లో రీఫిల్లింగ్ చేస్తున్న ముఠాను హైద‌రాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప‌ట్టించిన తండ్రి కొడుకులు…..

చూడిబజార్‌కు చెందిన వ్యాపారి అశోక్ తివారీ మరియు అతని కుమారుడు నమాన్ తివారి గ్యాస్ సిలిండర్ బరువు తక్కువగా ఉండటాన్ని గమనించి విచారణ జరిపారు. 30.4 కిలోలు ఉండాల్సిన సిలిండర్ సుమారు 28 కిలోలుగా ఉండటం గుర్తించారు. దీనిపై ఆరా తీయగా, జుమేరాత్ బజార్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్లను అక్రమంగా చిన్న సిలిండర్లలోకి రీఫిల్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు.ఈ విషయంపై గోషామహల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో, సంబంధిత సిద్దార్థ ఎంటర్‌ప్రైజెస్ ఏజెన్సీతో పాటు ఐదుగురిపై కేసు నమోదు చేసి, వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి కమర్షియల్, డొమెస్టిక్, చిన్న సిలిండర్లు మరియు రీఫిల్లింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ గారు, పౌర చైతన్యంతో వ్యవహరించిన తండ్రీకొడుకులను అభినందిస్తూ, సమాజంలో జరుగుతున్న అక్రమాలపై ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

మెడికల్ సీట్ల పేరుతో మోసం……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *