NewsInn

News in a Click

ఉత్కంఠ మ‌ధ్య PBKS పై గుజ‌రాత్ టైట‌న్స్ విజ‌యం

ఉత్కంఠ మ‌ధ్య PBKS పై గుజ‌రాత్ టైట‌న్స్ విజ‌యం

(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)

ఐపీఎల్ సీజ‌న్ మొద‌లైన నాటి నుంచి విజ‌యాల‌ను న‌మోదు చేసుకుంటున్న పంజాబ్ కింగ్స్ మ‌రో మ్యాచ్ లో ఓట‌మిని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. గుజరాత్ టైట‌న్స్ కు త‌క్కువ స్కోరుకే పంజాబ్ కింగ్స్ ను క‌ట్ట‌డి చేయ‌డంతో సులువుగా విజ‌యం ద‌క్కించుకోవ‌చ్చ‌ని భావించింది. కానీ బ్యాటింగ్ లో గుజ‌రాత్ కూడా త‌డ‌బ‌డింది. గెలుపుకోసం శ్ర‌మించాల్సి వ‌చ్చింది. త‌క్కువ స్కోరును కాపాడుకునేందుకు పంజాబ్ బౌల‌ర్లు తీవ్ర య‌త్నం చేసి గుజ‌రాత్ పై వ‌త్తిడి పెంచారు. చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు ప‌లితం తేల‌కుండా విజ‌యం దోబూచులాడింది. ఒక బంతి మిగిలి ఉండ‌గా వాషింగ్ట‌న్ సుంద‌ర్ సిక్స్ కొట్టి గుజ‌రాత్ కు విజ‌యాన్ని అందించారు. 19.5 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 167 ప‌రుగులు చేసి గుజ‌రాత్ విజ‌యం సాధించింది.

164 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలో దిగిన గుజరాత్ కు కూడా శుభారంభం దక్క‌లేదు. సాయి సుద‌ర్శ‌న్ – గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించి 2వ ఓవ‌ర్లోనే 5 ప‌రుగులు చేసి గిల్ పెవీలియ‌న్ చేరుకున్నారు. సాయికి బ‌ట్లర్ జ‌త క‌ట్ట‌డంతో ఈ భాగ‌స్వామ్యం జ‌ట్టుకు మంచి స్కోరు అందించింది.16 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయిన గుజ‌రాత్ ఆ త‌రువాత రెండో వికెట్ ను 9 వ ఓవ‌ర్ లో బ‌ట్ల‌ర్ రూపంలో కోల్పోయింది. 22 బాల్స్ ఎదుర్కొని 2 సిక్స్ లు 1 ఫోర్ తో 26 ప‌రుగులు చేసి బ‌ట్ల‌ర్ ఔట‌య్యారు. క్రీజులో నిల‌దొక్కుకున్న సాయి సుద‌ర్శ‌న్ కు నిషాంత్ సింధూ తో క‌లిసి విలువైన భాగ‌స్వామ్యం అందించారు. సింధూ 15 ప‌రుగులు చేసి మూడో వికెట్ రూపంలో 94 ప‌రుగుల వ‌ద్ద వెనుదిరిగారు. మ‌రో 30 ప‌రుగుల అనంత‌రం సాయి సుద‌ర్శ‌న్ కూడా 41 బంతుల్లో 57 ప‌రుగులు చేసి ఔట్ కావ‌డంతో పంజాబ్ ఊపిరి పీల్చుకుంది.

కాని వాషింగ్ట‌న్ సుంద‌ర్, రాహూల్ తేవాటియా లు జ‌ట్టుకు విలువైన భాగ‌స్వామ్యం అందించే య‌త్నం చేశారు కానీ రాహూల్ తేవాటియా 2 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యారు. దీంతో 140 ప‌రుగుల‌కు 5 వికెట్లు కోల్పోయింది. వాషింగ్ట‌న్ సుంద‌ర్ క్రీజులో ఉండ‌డంతో గుజ‌రాత్ ధీమాగా క‌నిపించింది.జాస‌న్ హోల్డ‌ర్ అర్ష‌దీప్ బౌలింగ్ లో 19వ ఓవ‌ర్లో 5 ప‌రుగులు చేసి ఔట్ కావ‌డంతో మ్యాచ్ ఆస‌క్తి క‌రంగా మారింది. 7 బంతుల్లో 12 ప‌రుగులు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.చివ‌రి ఓవ‌ర్ లో విజ‌యం కోసం గుజరాత్ కు ఆరు బంతుల్లో 11 ప‌రుగులు చేయాల్సి వ‌చ్చింది.

బ్యాటింగ్ లో త‌డ‌బ‌డ్డ పంజాబ్ కింగ్స్…..

చివ‌రి ఓవ‌ర్ వేసి స్టోయినిస్ మొద‌టి బంతి వైడ్ గా వేశారు. రెండో బంతిని అర్ష‌ద్ బౌండ‌రీకి త‌ర‌లించారు. దీంతో పంజాబ్ జ‌ట్టుపై వ‌త్తిడి పెరిగింది. ఆ త‌రువాతి బంతికి రెండు ప‌రుగులు అర్ష‌ద్ సాధించారు.3వ బంతికి అర్ష‌ద్ ప‌రుగులు చేయ‌లేక‌పోయారు. 3 బంతుల్లో నాలుగు ప‌రుగులు అవ‌స‌రం కాగా… నాలుగో బంతికి ఒక ప‌రుగు తీసుకుని వాషింగ్ట‌న్ సుంద‌ర్ కు అవ‌కాశం ఇచ్చారు. దీంతో రెండు బంతుల్లో 3 ప‌రుగులు గుజ‌రాత్ కు అవ‌స‌రం అయ్యాయి. ఐదో బంతిని సుంద‌ర్ సిక్స్ కు త‌ర‌లించ‌డంతో ఒక్క బంతి మిగిలి ఉండ‌గా నాలుగు వికెట్ల తేడాతో గుజ‌రాత్ విజ‌యం ద‌క్కించుకుంది.వాషింగ్ట‌న్ సుంద‌ర్ 23 బంతుల్లో 40 ప‌రుగులు చేసి నాటౌట్ గా ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *