NewsInn

News in a Click

GT బౌల‌ర్ల హ‌వా…..PBKS నామ‌మాత్ర‌పు స్కోరు

GT బౌల‌ర్ల హ‌వా…..PBKS నామ‌మాత్ర‌పు స్కోరు

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌)

ఈ సీజ‌న్ లో తిరుగులేని జ‌ట్టుగా ఐపీఎల్ లో కొన‌సాగుతున్న పంజాబ్ కు గుజరాత్ టైట‌న్స్ చుక్కులు చూపించింది. పంజాబ్ బ్యాటింగ్ ఆర్ఢ‌ర్ పై గుజ‌రాత్ పంజా విసిరింది. ఎక్క‌డా పంజాబ్ బ్యాట‌ర్ల‌ను క్రీజులో కుదురుకోకుండా చేసింది. గుజరాత్ బౌల‌ర్లు పంజాబ్ బ్యాట‌ర్ల‌పై చెల‌రేగ‌డంతో ఒక ద‌శ‌లో 50 ప‌రుగుల లోపే ఆ జ‌ట్లు టాప్ ఆర్డ‌ర్ పెవీలియన్ చేరుకుంది. తొలి ఓవ‌ర్ నుంచే పంజాబ్ బ్యాటింగ్ లో త‌డ‌బ‌డింది.20 ఓవ‌ర్ల‌లో పంజాబ్ 9 వికెట్లు కోల్పోయి 163 ప‌రుగులు చేసి గుజ‌రాత్ ముందు 164 ప‌రుగుల ల‌క్ష్యం ఉంచింది.

అధ్బుత‌మైన పాంలో ఉన్న పంజాబ్ బ్యాట‌ర్లు ఈ మ్యాచ్ లో విఫ‌లం అయ్యారు. ప్రియాన్ష్ ఆర్య కేవ‌లం 2 ప‌రుగులు మాత్ర‌మే చేసి సిరాజ్ బౌలింగ్ లో రెండో బంతికే వెనుదిరిగారు. ఆ త‌రువాత బ్యాటింగ్ కు వ‌చ్చిన కూప‌ర్ కాన్లీ బ్యాటింగ్ కు వ‌చ్చి తొలి బంతికే ఔటై తిరిగి వెళ్లి పోయారు. ప్ర‌భ‌మ‌న్ సిమ్రాన్- కెప్ట‌న్ శ్రేయ‌స్ అయ్య‌ర్ లు కొద్ది సేపు గుజ‌రాత్ బౌల‌ర్ల‌ను ప్ర‌తిఘ‌టించి స్కోరు చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఫాంలో ఉన్న ప్ర‌భ్ మ‌న్ 35 ప‌రుగుల వ‌ద్ద 3 వ వికెట్ రూపంలో 15 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యారు. అయినా ఆచితూచి ఆడిన కెప్ట‌న్ శ్రేయ‌స్ అయ్య‌ర్ కూడా ర‌న్ రేట్ పెంచే క్ర‌మంలో 19 ప‌రుగులు చేసి వెనుదిరిగారు.

దీంతో36 ప‌రుగుల‌కే 4 వికెట్లు, 47 ప‌రుగుల వ‌ద్ద 5వ వికెట్ కోల్పోయి పీక‌లోతు క‌ష్టాల్లో ప‌డింది. 10 ఓవ‌ర్ల‌లోపే 5 వికెట్లు కోల్పోయి 50 ప‌రుగుల స్కోరును చేరుకోలేక‌పోయిన పంజాబ్ కింగ్స్ ను స్టొయినిస్- సూర్యాన్స్ షిడ్గేలు ధాటిగా ఆడి ఇన్నింగ్ చ‌క్క దిద్ద‌డంలో మిగిలిన బ్యాట‌ర్ల కంటే మెరుగ్గా ఆడారు. పంజాబ్ బ్యాట‌ర్లు అంతా ఇబ్బందులు ప‌డుతుంటే షిఢ్గే గుజ‌రాత్ బౌల‌ర్ల‌పై విరుచుకు ప‌డ్డారు. కేవ‌లం 29 బంతులు ఎదుర్కొని 5 సిక్స్ లు, 3 ఫోర్ల‌తో 57 ప‌రుగులు చేసి ఔట్ అయ్యారు. స్లోయినిస్ షిడ్గే భారీ షాట్లు ఆడుతుండ‌డంంతో క్రీజులో ఉండి స‌హ‌క‌రించేందుకే ప్రాధాన్య‌త ఇచ్చారు. దీంతో జ‌ట్టు గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరు సాధించేందుకు వీలు చిక్కింది. షిడ్గే ఔటైన కొద్ది సేప‌టికే స్టొయినిస్ 31 బాల్స్ ఎదుర్కొని 40 ప‌రుగులు చేసి ఔట‌య్యారు. ఆ త‌రువాత బ్యాటింగ్ కు వచ్చిన బార్ట్ లెట్ కూడా వెంట‌నే ఔట్ కావ‌డంతో 141 ప‌రుగుల‌కు 8 వికెట్ల‌ను పంజాబ్ కోల్పోయింది. మ్యాచ్ మొత్తంతో స్లోయినిస్- షిడ్గే భాగ‌స్వామ్యం అత్య‌దికం.

గుజ‌రాత్ బౌల‌ర్లు త‌మ తొలి స్పెల్ లోనే సిరాజ్, ర‌బాడా, జాస‌న్ హోల్డ‌ర్ రెండు వికెట్లు తీసుకోగా….నాలుగు వికెట్లు తీసుకున్నారు. ఆరంభంలోనే గుజ‌రాత్ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది. పంజాబ్ బ్యాట‌ర్లు 12 వ ఓవ‌ర్ వ‌ర‌కు త‌డ‌బ‌డ‌తూ బ్యాటింగ్ చేసిన ఆ త‌రువాత క్ర‌మంగా స్కోరు ను ముందుకు తీసుకెళ్ల‌డంలో స‌క్సెస్ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *