NewsInn

News in a Click

మ‌మ‌తా బెన‌ర్జీకి మ‌రోసారి ఓట‌మే

(న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌)

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రిగా ఎన్నిక‌ల్లో పోటీ చేసిన మ‌మ‌తా బెన‌ర్జీ 2026 ఎన్నిక‌ల్లోనూ ఓడిపోయారు. గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మ‌మ‌తా ఓడిపోయినా….. టీఎంసీ విజ‌యం సాధించ‌డంతో ఆ ప్ర‌భావం పెద్ద‌గా క‌నిపించ‌లేదు. ఖాళీ అయిన ఓ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌మ‌తా బెన‌ర్జీ పోటీ చేసి విజ‌యం సాధించి సీఎం గా కొన‌సాగారు. 2026 ఎన్నిక‌ల్లో బ‌బానీపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన మ‌మ‌తా మ‌రోసారి సువేందు అధికారి చేతిలో ఓట‌మిని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. 2021 ఎన్నిక‌ల్లో కూడా నందిగ్రాం నియోజ‌క‌వ‌ర్గంలో సువేందు అధికారి చేతిలో ఓట‌మి ఎదుర్కొన్నారు. అనంత‌రం జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో భ‌వాని పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి మ‌మత ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్య‌మంత్రిగా కొన‌సాగారు. తాజాగా ఆ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ నేత‌గా పోటీ చేసిన మ‌మ‌త మాజీ అనుచ‌రుడు సువేందు అధికారి మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకున్నారు. పెద్ద రాష్ట్రాలైన త‌మిళ‌నాడు, ప‌శ్చిమ‌బంగాల్ లో ఇద్దిరు నేత‌లు ముఖ్య‌మంత్రులుగా పోటీ చేసి ఓట‌మి చెంద‌డం రాజ‌కీయంగా తీవ్ర చ‌ర్చ కు దారి తీస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *