NewsInn

News in a Click

ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న పై ప్ర‌భుత్వం ఫోక‌స్

ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న పై ప్ర‌భుత్వం ఫోక‌స్

(హైదరాబాద్ , న్యూస్ఇన్‌)

ఈ నెల 10వ తేదీన తెలంగాణలో ప్ర‌ధాన‌మంత్రి మోడీ పర్యటించనున్న నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాన మంత్రి పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్ల వివరాలను ఆయన సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో ప్రధానమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

దీంతో పాటు అదేరోజు బహిరంగసభలో పాల్గొననున్నారు. అందుకు అనుగుణంగా బ్లూ బుక్‌ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతలు, ట్రాఫిక్‌, బందోబస్త్‌ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు ప్రధాన కార్యదర్శి సూచించారు. బేగం పేట్ విమానాశ్రయం, హెలిప్యాడ్‌లతో పాటు అన్ని వేదికల వద్ద తగినన్ని అగ్నిమాపక వాహనాలు ఏర్పాటు చేయాలని ఫైర్ సర్వీసెస్ శాఖ అధికారులను, అవసరమైన వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి కాన్వాయ్‌ పర్యటించే మార్గాలలో రోడ్లను పరిశీలించాలని ఏ వైన మరమ్మత్తులు ఉంటే యుద్దప్రాతిపధికన పూర్తి చేయాలని పోలీసు, GHMC, రోడ్లూ భవణాల శాఖల అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటించే అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, ప్రధానమంత్రి పర్యటన విజయవంతంగా జరిగేలా చూడాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *