NewsInn

News in a Click

పుష్ప బాధితుల‌కు అల్లు కుటుంబం ప‌రామ‌ర్శ‌

పుష్ప బాధితుల‌కు అల్లు కుటుంబం ప‌రామ‌ర్శ‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

‘పుష్ప’ సినిమా విడుద‌లైన స‌మ‌యంలో సంధ్య థియేటర్ వద్ద జ‌రిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్‌ను అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, అల్లు అరవింద్ పరామర్శించారు. అతడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడిన ధైర్యం చెప్పారు. శ్రీతేజ్ చెల్లిని అరవింద్ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. తాను చదివిస్తానని, చదువుతావా అని బాలికను అడిగారు చ‌ద‌వుకుంటాను అని బాలిక చెప్ప‌డంతో ఇక ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచి ఆ బాలిక‌ను అల్లు ఫ్యామిలీ చ‌దించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

పుష్టా 2 విడుద‌ల సంద‌ర్బంగా జ‌రిగిన తొక్కిస‌లాట‌లో శ్రీతేజ్ త‌ల్లి మృతి చెంద‌డం, రాష్ట్ర ప్ర‌భుత్వం కేసు న‌మోదు చేయ‌డం సంచ‌ల‌నంగా మారిది. ఈకేసులో అల్లు అర్జున్ అరెస్టు దాకా వ్య‌వ‌హారం వెళ్లింది. ఆ త‌రువాత ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయ రంగు పులుముకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అటు రాజ‌కీయంగా ఇటు సినిమా ప‌రంగా పెద్ద వివాదానికి దారి తీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *