(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
ఉప్సల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ ఫీల్డింగ్ అలసత్వం ఎస్ ఆర్ హెచ్ భారీ స్కోరు కు కారణమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 235 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ ముందు 236 పరుగుల లక్ష్యం ఉంచింది. క్లాసెన్ 43 బంతులు ఎదుర్కొని 69 పరుగులు చేసి చివరి బంతికి ఔటయ్యారు. నితీష్ రెడ్డి 13 బంతులు ఎదుర్కొని 29 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.
దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ జట్టు తొలి వికెట్ భాగస్వామ్యం 79 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్లు 4 ఒవర్లలోనే 50 పరుగుల స్కోరును దాటింది. 54 పరుగుల వద్ద అభిషేక్ శర్మ 13 బాల్స్ లో 4 సిక్స్ లు , 2 ఫోర్లతో 35 పరుగులు చేసి ఔటయ్యారు. ఆతరువాత 84 పరుగుల వద్ద హెడ్ వికెట్ కోల్పోయింది. 6.4 ఓవర్ల వద్ద హెడ్ 19 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 38 పరుగులు చేసి వెనుదిరిగారు. ఆ తరువాత ఇషాన్ కిషన్- హెన్రిచ్ క్లాసెన్ లు భారీ స్కోరును నిర్మించే ప్రయత్నం చేశారు. 7వ ఓవర్ నుంచి 15 వ ఓవర్ వరకు 172 పరుగులకు స్కోరును చేర్చిన తరువాత ఇషాన్ కిషన్ వెనుదిరిగారు. ఇషాన్ 32 బంతులు ఎదుర్కొని 4 సిక్స్లు 2 ఫోర్లతో 55 పరుగులు చేసి ఔటయ్యారు. చాహల్ బౌలింగ్ లో పది పరుగుల లోపే ఇషాన్ ఇచ్చిన సులువైన క్యాచ్ ను పంజాబ్ జార విడవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.


ఆ తరువాత క్లాసెన్ పరిస్థితి కూడా దాదాపు ఇదే….అతి తక్కువ పరుగల వద్దే క్లాసెన్ ఇచ్చిన క్యాచ్ ను మరోసారి పంజాబ్ ఫీల్డర్ అందుకోలేకపోయారు. ఆ తరువాత క్లాసెన్ కూడా బ్యాటింగ్ లో విహారం చేశారు. పంజాబ్ బౌలర్లపై విరుచుకు పడి భారీగా పరుగులు చేశారు. క్లాసెన్ కు- నితీష్ రెడ్డి తోడు కావడంతో పంజాబ్ పై ఎస్ ఆర్ హెచ్ భారీ స్కోరు దిశగా అడుగుల వేసింది.వీరి భాగస్వామ్యం 27 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకుంది.












Leave a Reply