(చెన్నై,న్యూస్ఇన్)
తమిళనాడు ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజార్టీ దక్కకపోవడంతో అక్కడ కొత్త రాజకీయ వ్యూహాలకు తమిళ పార్టీలు పదును పెడుతున్నాయి. టీవీకే పార్టీ మెజార్టీకి కేవలం 10 సీట్లు దూరంగా నిలిచిపోవడంతో…. డీఎంకే, ఏఐఏడిఎం కే పార్టీలు తమ వ్యూహాలను అమలు చేయడం మొదలు పెట్టాయి. తమిళ వెట్రిగ కజగం పార్టీకి డీఎంకే తో పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. దీంతో కేవలం ఐదు మంది శాసనసభ్యుల బలం టీవీకే ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు లైన్ క్లియర్ అవుతోంది. చిన్నా చితకా పార్టీల నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యేలతో పాటు వామపక్ష పార్టీల నేతలు దీనిపై కసరత్తు చేస్తున్నారు. డీఎండీకే ఒక స్థానంలో విజయం సాధించడంతో టీవీకే అండగా ఉంటామని ప్రకటించింది.

ఈ ప్రభావం రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే అంశంగా మారింది. ఇదే సమయంలో ద్రవిడ రాజకీయ పార్టీలు కూడా ఒక్కటయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. రాజకీయంగా బద్ధ శతృవులుగా ఉన్నా, డీఎంకే, ఏఐఏడీఎం కులు ఒకటవుతాయా, లేదంటే టీవీకే పార్టీకి ఏఐఏడిఎం పార్టీ మద్దతు తెలిపి కీలక మంత్రిత్వ శాఖలను డిమాండ్ చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది. మంచి రోజులు వస్తాయని ఏఐఏడిఎంకే నేతలు సంకేతాలు ఇస్తుండడంతో డీఎంకే పార్టీకి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా రెండు పార్టీలు ఒక్కటయ్యే అవకాశం ఉందన్న ప్రచారం మొదలైంది. అయితే రాజకీయాల్లో శాశ్విత శతృవులు, మిత్రులు ఉండరనే నానుడి ఉంది. దీని పై టీవీకే కూడా భారీ ప్రణాళికతో చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. డీఎంకే, ఏఐఏడిఎంకే పార్టీలు కలిస్తే మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు టీవీకే రెడీ అవుతోంది. ఇదే జరిగితే రాజకీయంగా సంచలనంగా మారుతుంది. గవర్నర్ బ్రేకులు వేస్తుండడంతో విజయ్ దళపతి ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని అడ్డంకులే ఎదురౌతున్నాయని టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు.
తమిళ తంబీలకు తప్పని టెన్షన్……

ఫలితాలు వచ్చి దాదాపు ఐదు రోజులు అవుతున్నా… ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. టీవీకే సంపూర్ణ మెజార్టీ తో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తామని గవర్నర్ ప్రకటించడం హాట్ హాట్ గా మారింది. దీంతో గవర్నర్ తీరుపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే డీఎంకే మాత్రం ప్రతిపక్ష పార్టీగా ఉండేందుకు తాము ప్రాధాన్యతిస్తామని ప్రకటించింది. దీంతో రాజకీయం ఆసక్తి రేపుతోంది.









Leave a Reply