NewsInn

News in a Click

బెంగాల్లో బ‌ర్త‌ర‌ఫ్….తంబీల‌కు టెన్ష‌న్…!

బెంగాల్లో బ‌ర్త‌ర‌ఫ్….తంబీల‌కు టెన్ష‌న్…!

(చెన్నై,న్యూస్ఇన్‌)

రెండు ప్ర‌ధాన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు దేవ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయంశంగా మారాయి. రెండు రాష్ట్రాల్లో గ‌వ‌ర్న‌ర్లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ హాట్ గా మారాయి. బెంగాల్ లో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటుకు మాజీ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స‌హ‌క‌రించ‌న‌ని తేల్చి చెప్పారు. రాజ‌కీయంగా వంద స్థానాల్లో బీజేపీ త‌ప్పుడు ఫ‌లితాలు వ‌చ్చేలా చేసింద‌ని మ‌మత ప్ర‌ధాన ఆరోప‌ణ.బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాష్ట్రంలో వ‌చ్చినా…. సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసేది లేద‌ని మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌క‌టించి వివాదానికి ఆజ్యం పోశారు. అయితే పూర్తి మెజార్టీ రావ‌డంతో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటుకు వేగంగా చ‌ర్య‌లు తీసుకుంటుంది. మ‌మ‌త రాజీనామా చేయ‌క‌పోయినా..గ‌వ‌ర్న‌ర్ గ‌త ప్ర‌భుత్వాన్ని రద్దు చేస్తూ త‌న విశేష అధికారాల‌తో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటుకు చ‌ర్య‌లు మొద‌లు పెట్టారు. రాజ్యం ప‌రంగా గ‌వ‌ర్న‌ర్ కు ఉన్న విశేష అధికారాల‌తో సంబంధం లేక‌పోయినా…మెజార్టీ వ‌చ్చిన పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు గ‌వ‌ర్న‌ర్ హోదాలో స‌రైన నిర్ణ‌యం తీసుకున్నార‌న‌డంలో ఎలాంటి అనుమానాం లేదు. బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటుకు ముందే మ‌మ‌త వివాదాలు సృష్టించ‌డంతో అంతే సీరియ‌స్ గా బీజేపీ కూడా త‌మ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు ప‌శ్చిమ బంగాల్ ల్ పావులు క‌దుపుతోంది.

అయితే త‌మిళ నాడు ప‌రిస్థితి భిన్నంగా ఉంది. త‌మిళ నాడు ఎన్నిక‌ల్లో ఏ రాజ‌కీయ పార్టీకి సంపూర్ణ మెజ‌ర్టీ రాలేదు. ప్ర‌భుత్వ ఏర్పాటులో ప్ర‌తిష్టంభ‌న కొన‌సాగుతోంది. రెండు సార్లు టీవీకే అధినేత విజ‌య్ గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరినా ఎలంటి స్పంద‌న లేదు. ప్ర‌భుత్వ ఏర్పాటులో మెజార్టీ స‌భ్యుల మ‌ద్ద‌తు కూడ‌గడితేనే అవ‌కాశం అని లోక్ భ‌వ‌న్ వ‌ర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. దీంతో అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించిన టీవీకే – డీఎంకే, ఏఐఏడిఎంకే మిన‌హా ఇత‌ర పార్టీల‌తో చ‌ర్చ‌లు మొద‌లు పెట్టింది. 234 శాస‌న‌స‌భా స్థానాలున్న త‌మిళ నాడులో మెజార్టీ సాధించంలే క‌నీసం 118 స్థానాల్లో గెలుపొందాలి, విజ‌య్ ద‌ళ‌ప‌తి పార్టీ 108 స్థానాల‌కు పరిమితం అయింది. దీంతో త‌మిళ నాడు రాజ‌కీయాల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించింది. మ‌రో రెండు పార్టీలు డీఏంకే, ఏఐఏడిఎంకే పార్టీలు 59,47 స్థానాల్లో విజ‌యం సాధించాయి. కాంగ్రెస్ 5, పీఎంకే 4, బీజేపీ 1, కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టికే టీవీకే కు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని బ‌హిరంగంగానే ప్ర‌క‌టించింది. దీంతో టీవీకే మ‌ద్ద‌తు 113 కు చేరింది. మ‌రో ఐదు స్థానాలు మాత్ర‌మే టీవీకే ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు అవ‌స‌రం. ఇదే జాబితాతో గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర విశ్వ‌నాథ్ అర్లేక‌ర్ కు టీవీకే చీఫ్ విజ‌య్ క‌లిసి ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు.

అయితే పూర్తి మెజార్టీ రాక‌పోవ‌డంతో గ‌వ‌ర్న‌ర్ త‌న‌కున్న విశేష అధికారాల‌తో 118 మంది స‌భ్యుల జాబితా ను త‌న‌కు స‌మ‌ర్పిస్తేనే ప్ర‌భుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాన‌ని తేల్చి చెప్పారు. రెండు వారాల గ‌డువు ఇస్తే…అసెంబ్లీలో బ‌ల‌నిరూప‌ణ చేసుకుంటాన‌ని విజ‌య్ గ‌వ‌ర్న‌ర్ ను కోరినా… గ‌వ‌ర్న‌ర్ ఏ మాత్రం సానుకూలంగా స్పందించ‌లేదు. దీంతో త‌మిళ నాడులోని రాజ‌కీయ పార్టీల‌న్నీ గ‌వ‌ర్న‌ర్ తీరుపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాయి. అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించినా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌భుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌క‌పోవ‌డం….పై నుంచి విజ‌య్ కు డిసిగ్నేట‌రీ సీఎంగా భావించి పోలీసులు ముందస్తు భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకోవ‌డాన్ని గ‌వ‌ర్న‌ర్ ప్ర‌స్తావించ‌డంతో విజ‌య్ కు అద‌న‌పు భ‌ద్ర‌త‌ను పోలీసు శాఖ తొల‌గించింది.

డీఎంకే స్టాలిన్ సీరియ‌స్…..

బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం జోక్యం కార‌ణంగానే గ‌వ‌ర్న‌ర్ త‌న విశేష అధికారాల‌ను ఇక్క‌డ ప్ర‌యోగిస్తున్నార‌ని, సాధార‌ణం కంటే భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌డం రాజ‌కీయ కుట్ర‌లో భాగ‌మేఅని పొలిటిక‌ల్ గా చ‌ర్చ జ‌రుగుతోంది.గ‌వ‌ర్న‌ర్ తీరును నిర‌సిస్తూ కాంగ్రెస్ స‌హా మ‌రికొన్ని రాజ‌కీయ పార్టీలు శుక్ర‌వారం ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *