NewsInn

News in a Click

అభివృద్ధికి ‘గుడి-గ‌డి’లు క‌లిసి వ‌చ్చాయి

అభివృద్ధికి ‘గుడి-గ‌డి’లు క‌లిసి వ‌చ్చాయి

(హైద‌రాబాద్, న్యూస్ఇన్‌)

కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని 50 ఏళ్ల‌కు పైగా రాజ‌కీయంగా శాసించిన గుడి-గ‌డి రాజ‌కీయాలు అభివృద్ధికి క‌లిసి వ‌చ్చాయ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌లు చేశారు. కోడంగ‌ల్ లో వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌య ఆధునీక‌ర‌ణ ప‌నుల‌తో పాటు దౌల్తాబాద్, కోస్గిల్లో దేవాల‌యాల‌కు ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో మాట్లాడుతూ కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌డుతున్న అభివృద్ధి ప‌నుల‌ను వివ‌రించారు. ల‌గ‌చ‌ర్ల‌లో విద్యా సంస్థ‌ల‌తో 220 ఎక‌రాల్లో హ‌బ్ మొద‌లు పెడుతున్న‌ట్లు చెప్పారు. విద్యను అభ్య‌సించేందుకు హైద‌రాబాద్ నుంచి కోడంగ‌ల్ కు వ‌స్తార‌న్న‌రు.

త్వ‌ర‌లో టేకుల్ కోడ్ ద‌గ్గ‌ర సిమెంట్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తామ‌న్నారు. వికారాబాద్ కృష్ణా రైల్వే లైను క‌ల కూడా త్వ‌ర‌లోనే సాకారం చేస్తామ‌న్నారు. కోడంగ‌ల్ అభివృద్ధికి గ‌తంలో ప్ర‌త్యేకంగా ఎలాంటి నిధులు తెచ్చుక‌నే అవ‌కాశం ద‌క్క‌లేద‌న్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచినా…మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌క‌పోవ‌డంతో ఆశించిన అభివృద్ధి జ‌రుగ‌లేద‌న్నారు. కోడంగ‌ల్ ప్ర‌జ‌లు ఆశిర్వాదిస్తే…సీఎంగా ప‌ద‌వి వ‌రించింద‌న్నారు. గ‌తంలో ఉపాధి, ఉద్యోగాల కోసం ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లే ప‌రిస్థితుల‌ను అధిగ‌మించి ఇక్క‌డ భారీ పారిశ్రామిక వాడ‌ను అభివృద్ధి చేస్తున్నామ‌న్నారు. రాజ‌కీయాల‌కు అతీతంగా అభివృద్ధికి అంతా క‌లిసి రావాల‌న్నారు. విద్యా, వైద్యం, సంక్షేమం, సాగునీరు అందించే బాధ్య‌త‌ను తీసుకున్నానని చెప్పారు. దేశంలోని ప్ర‌ముఖ ప‌రిశ్ర‌మ‌లు కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు అవుతున్నాయ‌ని చెప్పారు. ఈ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిక మంత్రులు కూడా పూర్తిగా స‌హ‌క‌రిస్తున్నార‌ని చెప్పారు.

కోడంగ‌ల్ టార్గెల్…….2027

కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నులను వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్ 2027 నాటికి పూర్తి చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఈ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి కావాల్సిన అన్ని వివ‌రాల‌ను అందించాల‌న్నారు. కోడంగల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆద‌ర్శ నియోజ‌క‌వ‌ర్గంగా అభివృద్ధి చెసుకుందామ‌ని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు, రైల్వే లైన్, విద్యా సంస్థ‌ల నిర్మాణాల‌న్నీ పూర్తి చేసేందుకు ఎక్క‌డా ఎలాంటి అడ్డంకులు లేవ‌న్నారు. ఇంత‌కంటే ఉన్న‌త ప‌ద‌వి రాష్ట్రంలో ఉండ‌ద‌ని, ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. కోడంగ‌ల్ లో నాటిన మొక్క ఇప్పుడు ఫ‌లాలను ఇస్తుంద‌న్నారు. రాష్ట్ర రాజ‌కీయాలు, అభివృద్ధి విష‌యంలో తాను బీజీగా గ‌డుపుతుండ‌డం వ‌ల్ల కోడంగ‌ల్ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు ఎక్కువ‌గా రాలేక‌పోతున్నాన‌ని, ఈ మొక్క‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త మీపై ఉంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *