NewsInn

News in a Click

మైనార్టీల‌కు కొత్త సిల‌బ‌స్ తో డిగ్రీ కోర్సులు

మైనార్టీల‌కు కొత్త సిల‌బ‌స్ తో డిగ్రీ కోర్సులు

(హైద‌రాబాద్‌,న్యూస్ఇన్‌)

మైనారిటీ విద్యార్థుల కోసం ఉమ్మ‌డి జిల్లా కేంద్రాల్లో ప్ర‌త్యేక డిగ్రీ క‌ళాశాల‌లు ఏర్పాటు చేయాల‌ని.. వాటిలో నైపుణాభివృద్ధి, ఏఐ శిక్ష‌ణ‌కు ప్రాధాన్య‌మివ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సంప్ర‌దాయ కోర్సులు కాకుండా వారి జీవ‌నోపాధికి ఉప‌యోగ‌ప‌డే శిక్ష‌ణ ఇప్పించాల‌న్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌చివాల‌యంలో శుక్ర‌వారం సాయంత్రం స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌తిభావంతులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల‌కు ఇస్తున్న‌ట్లే మైనారిటీ విద్యార్థుల‌కు ప్రోత్సాహాకాలు అందించాల‌ని,ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కార్య‌క్ర‌మం ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.

గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3కి ఎంపికైన మైనారిటీ అభ్య‌ర్థుల్లో ఆస‌క్తి ఉన్న వారిని ఎంపిక చేసి మైనారిటీ సంక్షేమ శాఖ‌లో బాధ్య‌త‌లు అప్ప‌గించి… ఆ శాఖ ప‌రిధిలో చేప‌ట్టే అన్ని కార్య‌క్ర‌మాల‌పై పూర్తి అవ‌గాహ‌న క‌లిగించేలా వారిని తీర్చిదిద్దాల‌ని సీఎం ఆదేశించారు. విద్యార్థుల‌కు ప్రోత్సాహాకాలు అందించే కార్య‌క్ర‌మానికి గ్రూప్స్‌కు ఎంపికైన వారిని, క్రీడాకారుల‌ను ఆహ్వానించి విద్యా, క్రీడ‌ల ప్రాధాన్య‌త‌ను వారికి తెలియ‌జేయాల‌ని సూచించారు. ఇమామ్‌, మౌజ‌మ్‌ల‌కు ఇచ్చే గౌర‌వ పారితోషికాల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా విడుద‌ల చేయాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. మైనారిటీ పాఠ‌శాల‌ల్లో బోధ‌న‌లో ఏఐకు ప్రాధాన్య‌మివ్వాల‌ని సీఎం సూచించారు. భూ ల‌భ్య‌త ఉన్న చోట ఖ‌బ‌ర‌స్తాన్‌ల‌కు స్థ‌లాలను కేటాయిస్తామ‌ని సీఎం తెలిపారు. డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఇంజిన్ల‌తో రీట్రోఫిట్టింగ్ చేయడం ద్వారా ఆటోడ్రైవర్లకు ఇంధన ఖర్చులు లేకుండా చేసి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఒక ప్రణాళిక రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

హ‌జ్ యాత్ర‌ను ప్రారంభించిన సీఎం……

మూసీ రివ‌ర్ ఫ్రంట్‌లో భాగంగా గుడితో పాటు మసీద్, చర్చి, గురుద్వారా నిర్మాణాలు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆయా మతాలకు సంబంధించిన సంస్కృతుల అధ్యయనం, భారత దేశ విశిష్టతను, తెలంగాణలోని గంగా జమునా తెహ్‌జీబ్ ను తెలియ‌జేసేలా ఆ కట్టడాలు ఉండాల‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. మన సంస్కృతులను అధ్యయనం చేసే గొప్ప అధ్య‌య‌న కేంద్రాలుగా అవి పరిఢ‌విల్లాలని సీఎం ఆకాంక్షించారు. స‌మీక్ష అనంత‌రం నాంపల్లిలో హాజ్ యాత్రకు వెళ్లే వారి బ‌స్సుల‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా సీఎం మాట్లాడుతూ పెరిగిన ఇంధ‌న చార్జీల‌తో హ‌జ్ యాత్రికుల‌పై ప‌డ‌కుండా ప్ర‌భుత్వ‌మే భ‌రించాల‌ని నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు.

కోడంగ‌ల్ లో ఆల‌యప‌నుల‌కు శ్రీకారం….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *