(హైదరాబాద్,న్యూస్ఇన్)
ప్రధాని మోడీ పర్యటనకు ముందు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ భగీరథ్ చుట్టూ వివాదం ముసురుకుంది. ఇది మంత్రి సంజయ్ కు కూడా సెగతగిలేలా కనిపిస్తోంది. బండి సంజయ్ తనయుడు గతంలో కూడా వివాదాల్లో చిక్కుకున్న సందర్భాలున్నాయి. తాజాగా మరోసారి వివాదాల్లో చిక్కుకోవడంతో రాజకీయంగా ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. దీనికి సంబంధించి రెండు భిన్న కథనాలు వెలుగులోకి వచ్చాయి.
బండి సంజయ్ తనయుడు భగీరథ్ ఓ మైనర్ బాలికకు బలవంగంగా ఆల్కహాల్ తాగించి అత్యాచారం చేశారన్నది ఆరోపణ. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు వెళితే పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసేందుకు గత రాత్రి నుంచి నిరాకరిస్తున్నారన్నది ప్రచారం. బాలిక ఆత్మహత్యా తయత్నం చేయడంతో బాలిక తల్లిదండ్రులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళితే ఫిర్యాదు మాత్రమే తీసుకున్న పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేయకుండా పెండింగ్ లో పెట్టడం వివాదాస్పదంగా మారింది. ఓ సామాన్యడిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు ఇలాగే వ్యవహరిస్తారా అన్నది ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. రాత్రంతా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయకుండా పెండింగ్ లో ఉంచడం వెనుక కేంద్ర మంత్రి వత్తిళ్లు ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

తనయుడిపై ఫోక్సో కేసు నమోదు కాకుండా బండి చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా పోలీసులు ఎవరిపైన ఫిర్యాదు చేస్తే తీసుకోవడం…కేసు నమోదు చేయడంతో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం వెంటవెంటనే జరిగిపోతాయి. కాని ఇక్కడ అలా జరుగక పోవడం చర్చకు దారితీస్తోంది.బండి సంజయ్ తనయుడు గతంలో కూడా వివాదాల్లో చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. మహేంద్ర యూనివర్సిటీ ఘటనతో పాటు యూపీలో కూడా బండి సంజయ్ పై తనయుడిపై కేసులు ఉన్నాయని ఫిర్యాదు దారులే ఆరోపిస్తున్నారు.
అయితే ఈ కేసుకు సంబంధించి మరో కోణం కూడా ఉంది…. బండి సంజయ్ తనయుడిని హనీ ట్రాప్ లో వేసి వసూళ్లు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి కొడుకును బ్లాక్ మేయిల్ చేసేందుకు ఆ బాలిక కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేశారని అంటున్నారు. ఈ మహిళపై బండి సంజయ్ తనయుడు ఇప్పటికే కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. భారీగా డబ్బులు వసూలు చేసే కుట్ర ఆ మహిళ చేసిందన్న ప్రచారం ఉంది. అయితే ఈ వ్యవహారంలో బాలిక తల్లి తన కూతురు వయస్సు చిన్నగా చూపిస్తూ పోలీసులను తప్పుదోవ పట్టిస్తుందన్న వాదన కూడా ఉంది. ఒకే ఘనటకు రెండు కోణాలు వెలుగు చూడడం విశేషం. కోర్టు సినమా కథ ఆధారంగా ఈ పోక్సో కేసు కథ నడిపించారన్న ప్రచారం కూడా ఉంది. ఈ వ్యవహారంలో వాస్తవాలను తేల్చడంపై పోలీసులు ఏం తెలుస్తారన్నది ఆసక్తి రేపుతున్న ఆంశంగా మారింది.
కేంద్ర మంత్రి తనయుడిపై ఫిర్యాదు కావడంతో పోలీసులు కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్తితి ఏర్పడింది. ఉన్నతధికారుల ఆదేశం కోసం పోలీసులు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా ఎవరిపై కేసు నమోదు చేస్తారన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.








Leave a Reply