NewsInn

News in a Click

ఇది సిగ్గుచేటు….చెరగని మచ్చ

స్పీకర్ తీర్పు పై మాజీ మంత్రి హరీశ్

(హైదరాబాద్, న్యూస్ఇన్)

Harish rao pic

ఫార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ వెల్లడించిన తీర్పు సిగ్గుచేటుగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు… ఇది ప్రజాస్వామ్యానికి చెరగని మచ్చ లాంటిదన్నారు.
రాహుల్ గాంధీ గారి “సేవ్ ది కానిస్టిట్యూషన్” నినాదం, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పుతో నేడు పూర్తిగా బహిర్గతమైందన్నారు. స్పీకర్ తిరుపతి స్పందిస్తూ ఆయన ప్రకటన విడుదల చేశారు.
రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ సంస్థలను కూడా దిగజార్చడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని ఆరోపించారు.ప్రజాస్వామ్య సూత్రాలను తీవ్రంగా దెబ్బతీసిన ఈ ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందన్నారు.పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిన యాంటీ-డిఫెక్షన్ నియమాలను పూర్తిగా పక్కన పెట్టి, అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం – ఇది రాజ్యాంగాన్ని కాలరాయడమే అన్నారు.ఢిల్లీలో రాజ్యాంగ నైతికతపై గొప్ప ఉపన్యాసాలు ఇస్తూ, తెలంగాణలో మాత్రం అదే రాజ్యాంగాన్ని నిర్లజ్జగా ధిక్కరించడం – ఇదీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీల నిజస్వరూపం.
“సేవ్ ది కానిస్టిట్యూషన్” నినాదం మాటలకే పరిమితమై, ఆచరణలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *